ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్‌ విచారణపై హైకోర్టు స్టే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 02, 2025, 02:44 PM

వైసీపీ అధినేత జగన్, పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామ పర్యటనకు వెళ్తుండగా, వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త సింగయ్య ప్రమాదవశాత్తూ మరణించాడు. అయితే వైయ‌స్ జగన్‌ కాన్వాయ్‌ కారణంగానే సింగయ్య మరణించాడంటూ నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలంటూ వైయ‌స్‌ జగన్‌తో పాటు పలువురు ఆయన వ్యక్తిగత కార్యదర్శి, వైయ‌స్ఆర్‌సీపీ నేతలూ క్వాష్‌ పిటిషన్లు వేయగా.. వాటంన్నింటిని కలిపే హైకోర్టు విచారణ జరుపుతోంది. గత విచారణ సందర్భంగా.. సింగయ్య మృతికి వైయ‌స్‌ జగన్‌ కారకులు ఎలా అవుతారంటూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్నవాళ్లపై ఎలా కేసు పెడతారు?. ప్రమాదానికి ప్రయాణికులను ఎలా బాధ్యుల్ని చేస్తారు?. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కుంభమేళాలో తొక్కిసలాట ఘటన జరిగింది కదా’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. నేటి విచారణలో వైయ‌స్ జగన్‌ విచారణపై ఏకంగా స్టే విధించడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa