ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీశైల ఆలయంలో పునః ప్రారంభమైన ఉచిత స్పర్శ దర్శనాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 02, 2025, 05:30 PM

శ్రీశైల మల్లికార్జున స్వామి భక్తులకు దేవస్థానం శుభవార్త అందించింది. సుమారు ఏడాది కాలంగా నిలిచిపోయిన ఉచిత స్పర్శ దర్శనాలను నిన్నటి నుంచి పునరుద్ధరించింది. నిన్న ఉదయం ఆలయ అధికారుల పర్యవేక్షణలో ఈ సేవను తిరిగి ప్రారంభించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఉచిత స్పర్శ దర్శనం కోసం అధికారులు కొత్తగా టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. శ్రీశైలంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ టోకెన్లను ఆఫ్‌లైన్‌లో జారీ చేస్తారు. టోకెన్ పొందాలనుకునే భక్తులు తమ పేరు, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. దర్శనానికి వెళ్లే ముందు ఈ టోకెన్లను స్కాన్ చేశాకే లోపలికి అనుమతిస్తామని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా భక్తుల రద్దీని నియంత్రించడం సులభమవుతుందని భావిస్తున్నారు.గతంలో అమలులో ఉన్న విధానాన్నే పాటిస్తూ వారంలో నాలుగు రోజుల పాటు ఈ సేవను అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం 1:45 గంటల నుంచి 3:45 గంటల మధ్య భక్తులను స్పర్శ దర్శనానికి అనుమతిస్తారని ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) శ్రీనివాసరావు వెల్లడించారు.భక్తుల చిరకాల కోరిక మేరకు, ప్రతి ఒక్కరూ శ్రీ మల్లికార్జున స్వామివారిని స్వయంగా స్పృశించి, ఆధ్యాత్మిక అనుభూతిని పొందేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈఓ వివరించారు. ఏడాది విరామం తర్వాత ఈ సేవలు పునఃప్రారంభం కావడంతో స్వామివారిని నేరుగా తాకి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa