వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల సత్తెనపల్లె నియోజకవర్గంలోని రెంటపాళ్లకు వెళ్లే సమయంలో ప్రమాదవశాత్తు కారు కిందపడి ప్రాణాలు కోల్పోయిన వైసీపీ కార్యకర్త సింగయ్య మృతిపై ఆయన భార్య లూర్దు మేరీ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భర్త మృతిపై అనుమానాలున్నాయని.. ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో అంబులెన్సులోనే ఏదో జరిగిందని.. చిన్న చిన్న దెబ్బలకే ఎలా చనిపోతారంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. తాడేపల్లిలో వైఎస్ జగన్ను సింగయ్య భార్య లూర్దుమేరితో పాటు ఆమె కుమారులు, ఇతర కుటుంబ సభ్యులు కలిశారు. కాగా.. సింగయ్య మృతిపై స్పందించిన వైసీపీ అధిష్ఠానం అతని కుటుంబానికి ఇప్పటికే 10 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ప్రకటించింది. కాగా.. ఈరోజు బాధిత కుటుంబాన్ని కలిసి.. భవిష్యత్తులోనూ అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు. పిల్లలతో సరదాగా మాడ్లాడి.. ధైర్యం చెప్పారు. తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు. ఆసుపత్రికి తరలించేటప్పుడు అంబులెన్స్లోనే ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa