ఏపీ కేబినెట్ భేటీలో సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ భేటీలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా పలు కంపెనీలకు వైసీపీ మెయిల్స్ చేసిందంటూ చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ వ్యవహారాన్ని ఏపీ కేబినెట్ భేటీలో ప్రస్తావించారు. ఏపీఎండీసీ బాండ్లలో పెట్టుబడులు పెట్టవద్దంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 200 సంస్థలకు మెయిల్ చేసిందని పయ్యావుల కేశవ్ ప్రస్తావించగా.. ఈ విషయంపై సీరియస్ అయిన చంద్రబాబు, విచారణకు ఆదేశిస్తామని ప్రకటించారు.
మరోవైపు మంత్రులపైనా చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎవరూ కూడా సంతృప్తికరంగా పనిచేయడం లేదని అన్నట్లు సమాచారం. ఓ మహిళా ఎమ్మెల్యేను కించపరిచేలా, అభ్యంతరకరంగా మాట్లాడితే మంత్రులు ఎందుకు స్పందించలేదని చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో ఏం జరుగుతోందనే దానిపై మంత్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏడాదిలో నిత్యావసర ధరలు తగ్గించామన్న చంద్రబాబు.. ఈ విషయాన్ని మంత్రులు ప్రజలకు చెప్పడంలో విఫలమయ్యారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ బాండ్లు జారీ చేస్తూ ఉంటుంది. ఈ బాండ్లలో పెట్టుబడులు వద్దంటూ వైసీపీ నేత, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ఉదయభాస్కర్ అనే వ్యక్తి ద్వారా సుమారు 200 కంపెనీలకు మెయిల్స్ చేయించారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇటీవల ఆరోపించారు. అయితే కంపెనీలు చంద్రబాబు మీద నమ్మకంతో వాటిని పట్టించుకోకుండా బాండ్లు కొనుగోలు చేశాయన్నారు. ఉదయ్ భాస్కర్ మీద దేశద్రోహం కేసు పెట్టాలని.. వైఎస్ జగన్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలను కూడా విచారించాలని పయ్యావుల కేశవ్ చంద్రబాబును ఇటీవల కోరారు. తాజాగా ఈ అంశం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు రాగా సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశిస్తామని ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa