ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం నాడు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించి, శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ తన పర్యటనలో భాగంగా తొలుత కొత్తచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్కు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం, ఆయన నేరుగా పుట్టపర్తికి బయలుదేరి వెళ్లారు.అక్కడ ప్రశాంతి నిలయంలోని శ్రీ సత్యసాయి బాబా మహాసమాధి వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మంత్రి నారా లోకేశ్ నివాళులర్పించారు. ఈ పర్యటనలో పలువురు స్థానిక నాయకులు, అధికారులు కూడా పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa