ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 11, 2025, 05:25 PM

సోషల్ మీడియాలో అభ్యంతరకర, తప్పుడు పోస్టులు పెడితే, చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. పిల్లలు సామాజిక మాధ్యమాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లల నడవడికపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని కోరారు. ఆడ, మగ అని తేడా ఉండకూడదని.. తల్లిదండ్రులు ఇద్దరిని సమానంగా చూడాలని సూచించారు హోంమంత్రి అనిత.తాను ఒకప్పుడు టీచర్‌ని అని చెప్పడానికి గర్వంగా ఉంటుందని హోంమంత్రి అనిత ఉద్ఘాటించారు. మా నాన్న నాకు ఇచ్చిన ఆస్తి చదువు అని చెప్పుకొచ్చారు. ఇవాళ(జులై11, శుక్రవారం) నక్కపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హోం మంత్రి అనిత హాజరయ్యారు. ఈ సమావేశంలో తల్లిదండ్రులు, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను హోం మంత్రి అనిత సన్మానించారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత ప్రసంగించారు. కనిపించే దేవత అమ్మ.. అమ్మను ప్రతీ ఒక్కరూ గౌరవించాలని సూచించారు. విద్యను మించిన ఆస్తి లేదని ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వంలో తల్లిదంద్రులు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa