ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరాచకాలు, అల్లకల్లోలాలు తప్ప కూటమి చేసిందేమిలేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 12, 2025, 02:36 PM

ఏపీలో కూటమి ఏడాది పాలనలో ఏ రంగం చూసినా ఆరాచకం, అల్లకల్లోలమే మిగిలిందని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌, శాస‌న మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత‌ బొత్స సత్యనారాయణ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతులను కించపరిచేలా ప్రభుత్వం పెద్ద పెద్దలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అవకాశం ఉంది కదా అని కూటమి నేతలు అన్నీ దోచేస్తున్నారు అంటూ విమర్శలు చేశారు. డ్రగ్స్‌లో విశాఖను ఇంటర్నేషనల్ సిటీ చేశారు అంటూ ధ్వ‌జ‌మెత్తారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ శ‌నివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ఏడాది పాలన అస్తవ్యస్తంగా ఉంది. ఏ వర్గం సంతృప్తిగా లేదు. రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారి కష్టం ఆవిరి అయిపోతుంది. రైతులకు ప్రభుత్వం సాయం అందడం లేదు. రైతులను కించపరిచేలా ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారు. మామిడి రైతుల రూపంలో లబ్ధి పొందింది టీడీపీవాళ్లే. మిర్చి, పొగాకు, ఆక్వా ఏ రంగం తీసుకున్నా ఇదే పరిస్థితి. వైయ‌స్‌ జగన్‌ రైతుల గురించి మాట్లాడితేనే వాళ్ల బాధలు తెలుస్తాయి అని మండిపడ్డారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa