ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ నిరంకుశ, అవినీతి పరిపాలనకు బుద్దిచేప్పిన మారటం లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 13, 2025, 04:41 PM

‘‘చీకట్లో నరికేయండి" అని వైసీపీ నేత పేర్నినాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల సత్యనారాయణ కూడా పేర్న నాని వ్యాఖ్యలను ఖండించారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లడారు.‘‘గత ఎన్నికల ఫలితాల్లో జగన్ నిరంకుశ, అవినీతి పరిపాలనకు ప్రజలు గుణపాఠం చెప్పి.. ప్రతిపక్ష హోదా దక్కకుండా.. ఘోరంగా ఓడించారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కనీవినీ ఎరుగని రీతిలో కూటమి ప్రభుత్వం అత్యంత అధిక మెజార్టీతో అధికారాన్ని ఇచ్చారు.  మీరు ఓడిపోయిన అవమానంతో, అసూయతో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక దుష్ర్పచారం చేస్తూన్నారు. రప్పా.. రప్పా.. చీకట్లో కన్నుకొడితే పని అయిపోవాలి.. అని పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం..? మాజీ మంత్రిగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పేర్ని నాని ప్రజాస్వామ్యన్ని రక్షించేవిధంగా మాట్లాడాలి. కానీ, హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడటం దారుణం అని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa