బిసి మహిళ , కృష్ణా జిల్లా జెడ్పి చైర్ పర్సన్ ఉప్పాల హరికపై తెలుగుదేశం కార్యకర్తలు రాళ్లదాడి తెగబడడం దారుణమని వైయస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తీవ్రంగా ఖండించారు. భార్యాభర్తలిద్దరూ కారులో వెళ్తుంటే రాళ్లతో దాడి చేయడం, అది కూడా పోలీసుల సమక్షంలో జరగడం చూస్తుంటే, అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని ఆయన వాపోయారు. మనం ఆంధ్ర ప్రదేశ్ లోనే ఉన్నామా లేక పాకిస్తాన్ లో ఉన్నామా అన్నట్టుగా వ్యవహారం ఉందని భరత్ పేర్కొన్నారు. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఏడాదిపైగా వైయస్ఆర్సిపి శ్రేణులపై వేధింపులకు పాల్పడుతూనే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వేలాదిమంది కార్యకర్తలపై, నాయకులపై దాడులు చేస్తున్నారని,ఈవేళ నాటిన విత్తనం రేపొద్దున మహా వృక్షమై పర్యవసానాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచన చేసుకోవాలని భరత్ హెచ్చరించారు. ఎల్లకాలం ఒకరే అధికారంలో ఉండబోరని గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఉప్పాల హరికకు పూర్తిస్థాయిలో తాము అండగా ఉంటామని, వైయస్ జగన్ ఇప్పటికే అండగా నిలబడతామని కూడా చెప్పారని భరత్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa