లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో కీలక నిందితుడిగా (ఏ4) ఉన్న మిథున్ రెడ్డిని శనివారం రాత్రి 8:30 గంటల సమయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్టు చేసింది. విజయవాడలోని సిట్ కార్యాలయంలో సుమారు ఏడు గంటల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం మిథున్ రెడ్డిని అరెస్టు చేసినట్లు సిట్ అధికారులు ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు.ఆదివారం నాడు విజయవాడ ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డిని హాజరుపర్చగా, కోర్టు ఆయనకు ఆగస్టు 1 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దాంతో ఆయనను రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. రాజమండ్రి జైలు వద్ద వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa