ఎంపీ మిధున్ రెడ్డిని అక్రమంగానే అరెస్టు చేసారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. అసలు ఏ తప్పు చేశారని అరెస్టు చేసినట్లని ఆయన ప్రశ్నించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో మిథున్ రెడ్డి రిమాండ్ లో ఉన్న నేపథ్యంలో జైలు దగ్గర మంగళవారం ఉదయం మాజీ ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ అసలు స్కాం ఎక్కడ జరిగిందని మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసారని ప్రశ్నించారు. నిజానికి 2014- 2019 సమయంలో చంద్రబాబు హయాంలో 16,500కోట్లు లిక్కర్ పై వార్షిక ఆదాయం వస్తే, జగన్ హయాంలో ప్రభుత్వ ఆదాయం ఏటా 25వేల కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చిందని భరత్ చెప్పారు. పైగా ప్రభుత్వమే అమ్మకాలు చేసినపుడు అవినీతికి ఆస్కారం ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. అసలు కొత్తగా డిస్టిలరీలకు జగన్ హయాంలో అనుమతులు ఇవ్వలేదని, గతంలో చంద్రబాబు హయాంలో అనుమతులు ఇచ్చారని, దానిపైనా 2023లోనే కోర్టులో కేసు వేయడం జరిగిందని భరత్ వివరించారు. లిక్కర్ స్కామ్ అని చెప్పడమే కానీ 13నెలల కూటమి పాలనలో మనీ ట్రయల్ ఎక్కడ జరిగిందో తేల్చారా అని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి నేపథ్యంలో అక్రమ అరెస్టులతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని భరత్ విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa