ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధికారంలోకి రావడానికి అలివికాని హామీలిచ్చి, ఇప్పుడు చెయ్యలేం అంటారా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 23, 2025, 04:22 PM

ఎన్నికలకు ముందు ఆడబిడ్డ నిధి అంటూ మహిళలను ఆశపెట్టి, నేడు ఆ పథకానికే మంగళం పాడేందుకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ సిద్దమైందని విజయవాడ మేయర్ రాయని భాగ్యలక్ష్మి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి అచ్చెన్నాయుడు ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎత్తేస్తున్నామని పరోక్షంగా ప్రకటించడం ద్వారా మహిళలను మానసికంగా సిద్దం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది మహిళలను నమ్మించి వంచించడానికి చంద్రబాబు మరోసారి సిద్దమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆమె మాట్లాడుతూ... కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటై ఏడాది గ‌డిచినా సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌క‌పోగా ఒక్కో ప‌థ‌కాన్ని ఎత్తేసే కుట్ర‌ల‌కు ప్ర‌భుత్వం తెర‌దీస్తోంది. మోస‌పు హామీలిచ్చి మ‌హిళ‌ల ఓట్ల‌తో గెలిచిన కూట‌మి పార్టీలు అధికారంలోకి వ‌చ్చాక వంచ‌న‌కు గురిచేస్తున్నాయి. ఓట్ల కోసం మ‌హిళ‌ల‌ను న‌మ్మించేందుకు ఇంటింటికీ మేనిఫెస్టో తీసుకొచ్చి ఫేక్ బాండ్ల‌తో ప్ర‌చారం చేసుకున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ ఇస్తున్న ప‌థ‌కాల‌ను ఇస్తూనే సూప‌ర్‌సిక్స్ అమ‌లు చేస్తామ‌ని ప‌వ‌న్ క‌ళ్యాన్‌, చంద్రబాబు, లోకేష్ న‌మ్మ‌బ‌లికారు. ఎలాగైనా అధికారంలోకి రావాల‌న్న ఆలోచ‌న త‌ప్పించి, వాటిని అమ‌లు చేసే ఆలోచ‌న లేద‌ని త‌మ చ‌ర్య‌ల ద్వారా మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. ఆడ‌బిడ్డ నిధి పేరుతో 18 ఏళ్లు నిండిన ప్ర‌తి మ‌హిళ‌కు నెల‌కు రూ.1500 చొప్పున వారి అకౌంట్ల‌లో జ‌మ చేస్తామ‌ని ఎన్నిక‌ల్లో ఆర్భాటంగా ప్ర‌చారం చేసుకున్న టీడీపీ, జ‌న‌సేన, బీజేపీ పార్టీలు.. అధికారంలోకి వ‌చ్చి ఏడాది గ‌డిచినా ప‌థ‌కం అమ‌లు మీద దృష్టిసారించ‌లేదు. ఒక్క ఆడ‌బిడ్డ నిధి ప‌థ‌కం కింద‌ 13 నెల‌ల‌కు గాను దాదాపు రూ. 36 వేల కోట్లకుపైగా మ‌హిళ‌ల‌కు కూట‌మి ప్ర‌భుత్వం బ‌కాయి పడింది అని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa