ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. పథకాలు అమలు చేయలేము అని నేరుగా మంత్రులతో చంద్రబాబు మాట్లాడిస్తున్నారు అని వైసీపీ నేత అంజాద్బాషా అన్నారు. అయన మాట్లాడుతూ.... సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేక రాష్ట్రాన్ని అమ్మాలి అంటూ కొత్త నాటకాలు ఆడుతున్నారు. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలి అని మంత్రి అచ్చెన్నాయుడు అనడం విడ్డూరం. యువగళం పాదయాత్ర లో లోకేష్ , బాబు ష్యూరిటీ -భవిష్యత్ కు గ్యారెంటీ అంటూ ప్రచారం చేశారు. ఎన్నో పథకాలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి ఇప్పుడు గాలికి వదిలేశారు. అప్పుల సామ్రాట్ అని చంద్రబాబు కు దేశంలో బిరుదు ఇవ్వొచ్చు. రైతులకు సకాలంలో ఎరువులు అందక, పెట్టుబడి సహాయం లేదు, రుణాలు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు. పథకాల అమలుపై ఈ ప్రభుత్వానికి శ్రద్ధ లేదు కానీ.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమాకు టికెట్ పెంచే దానిపై ధ్యాస ఉంది అని మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa