కరేడు రైతుల పక్షాన వైయస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు మరోసారి స్పష్టం చేశారు. ఇవాళ నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన డీఆర్సీ సమావేశంలో కరేడు రైతుల సమస్యలపై ఎమ్మెల్సీ మాధవరావు ప్రభుత్వాన్ని నిలదీశారు. కరేడులో భూ సేకరణపై వివరణ ఇవ్వాలి..భూములు ఎంత సేకరిస్తున్నారో చెప్పాలంటూ తుమాటి మాధవరావు పట్టుపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..`సమస్యలపై గళమెత్తడానికి రాజకీయ అనుభవం అవసరం లేదు. శాసనమండలి సభ్యుడుగా సమస్యలపై గళమెత్తడానికి నాకు హక్కు ఉంది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఎమ్మెల్సీలు మాట్లాడేందుకు అర్హత లేదు అనడం హాస్యాస్పదంగా ఉంది. ఇండో సోల్ కంపెనీకి గతంలో మేము 5000 ఎకరాల కేటాయించాం. ఈ ప్రభుత్వం ఎనిమిది వేలు ఎకరాలు కావాలంటుంది. ఎవరు ప్రజల్ని మోసం చేస్తున్నారో అర్థం చేసుకోవాలి. ఇటీవల రెండు గ్రామాల్ని తరలించేందుకు 2000 ఎకరాలు సిద్ధం చేస్తున్నారు. పచ్చటి పొలాలను గ్రామాలను కదిలించేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. గ్రామాలకు గ్రామాలను పరిశ్రమల పేరుతో ఖాళీ చేయించడం ఘోరం. 3000 కుటుంబాలను పరిశ్రమల పేరుతో రోడ్డుకి ఈడ్చడం సబబు కాదు.` అంటూ మాధవరావు మండిపడ్డారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎమ్మెల్సీ మాధవరావు డీఆర్సీ సమావేశన్ని బహిష్కరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa