ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్లాక్ మార్కెట్ లో యూరియా తరలిపోతున్న ప్రభుత్వం నియంత్రించలేకపోతుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 25, 2025, 08:44 AM

యూరియా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని  క‌ర్నూలు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు ఎస్వీ మోహ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. రాష్ట్రంలో యూరియా కొర‌త‌పై ఆయ‌న స్పందించారు. ఎస్వీ మోహ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. `యూరియా ఎరువును రైతుల‌కు స‌కాలంలో అందించ‌డంలో కూట‌మి ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంది. బ్లాక్ మార్కెట్ లో యూరియా తరలిపోతున్న వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం చోద్యం చూస్తోంది. గత వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రం, మార్క్‌ఫెడ్‌ ద్వారా ఎరువులను అందించాం. కూటమి ప్రభుత్వంలో యూరియా పక్క రాష్ట్రాలకు తరలి పోతున్నా పట్టనట్లు వ్యవహరిస్తోంది. నెల్లూరు జిల్లా నుంచి యూరియా తమిళనాడు కు తరలిపోతుంది. కర్నూలు జిల్లా రైతులకు యూరియా అందుబాటులో లేక కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళి యూరియా తెచ్చుకుంటున్నారు. యూరియా అందించలేని ప్రభుత్వం ఎందుకు, రైతులకు పెద్ద పీట వేస్తామని చెప్పి ఇప్పుడు చేస్తున్న‌ది ఏమిటీ?. రాష్ట్రంలో యూరియా, విత్తనాల కోసం రైతులు క్యూ లైన్ లో ఉండి, చెప్పులను పెట్టి తీసుకునే పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వంలో రైతులకు ఏ మేలు జ‌ర‌గ‌డం లేదు. అభివృద్ధి అంతా అమరావతికే పరిమితం చేశారు. అమరావతి కాంట్రాక్టు కమీషన్ కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. అగ్రికల్చర్ మినిస్టర్ దీనిపై దృష్టి పెట్టాలి.  రైతుల సమస్యలపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది` అని ఎస్వీ మోహ‌న్ రెడ్డి హెచ్చ‌రించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa