14 నెలల కూటమి పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి లేదని, అప్పులు మాత్రం ఫుల్గా చేశారని వైయస్ఆర్ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ఏడాది పాలనలోనే ఏకంగా లక్షా 86 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారని ఆక్షేపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..`చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచిన అన్ని హామీలను మరిచారు. ప్రభుత్వ ఉద్యోగులకు అందాల్సిన అరియర్స్ కూడా ఇవ్వలేదు. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు దారుణమైన వ్యాఖ్యలు చేశారు. తల్లికి వందనం పథకంలో అరకొరగా లబ్ధిదారులకు అందించారు. నిబంధనల పేరుతో లక్షలాది మంది లబ్ధిదారులకు కోత విధించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను, అన్ని కులాల వారికి మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. సొమ్ము ఒకడిది సోకు ఒకరిది అన్న రీతిలో చంద్రబాబు పాలన సాగుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ పథకాలపై అసలు ఊసే లేదు` అని రవీంద్రనాథ్రెడ్డి ఫైర్ అయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa