ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగ కల్పనే ఈఎల్‌ఐ లక్ష్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 25, 2025, 09:21 AM

మూడున్నర కోట్లకు పైగా ఉద్యోగాలను సృష్టించడమే ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం(ఈఎల్‌ఐ) లక్ష్యమని ఉద్యోగుల భవిష్య నిధి, ఆదాయపన్ను శాఖలసీనియర్‌ అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌లో ప్రకటించిన ఈ పథకం గురించి రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య (ఏపీ ఛాంబర్స్‌) గురువారం విజయవాడలో అవగాహన సదస్సు నిర్వహించింది. ఏపీ ఛాంబర్స్‌ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సెంట్రల్‌ పీఎఫ్‌ అదనపు కమిషనర్‌ పి.వీరభద్రస్వామి, రీజినల్‌ పీఎఫ్‌ కమిషనర్లు హెమోంగ్‌ వెంకటేష్‌, ప్రభుదత్త పృష్టీ, అబ్దుల్‌ ఖాదర్‌, ఆదాయపన్నుశాఖ (టీడీఎస్‌) అధికారి పి.అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa