ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విమానం గాల్లో ఉండగానే ప్రయాణికుడు మృతి.. మృతదేహం మిస్సింగ్

international |  Suryaa Desk  | Published : Fri, Jul 25, 2025, 09:41 PM

విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. అయితే పైలెట్లు విమానాన్ని అత్యసవరంగా ల్యాండింగ్ చేయాలనుకున్నా కుదరకపోవడం.. గమ్యస్థానానికి చేరాకే మృతదేహాన్ని కిందకు దించారు. కానీ ఆ తర్వాత నుంచి మృతదేహం కనిపించకుండా పోయింది. దీంతో అటు సిబ్బందితో పాటు ఇటు అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అసలా మృతదేహం ఏమైంది, ఎలా మాయమైందని తెలుసుకునే పనిలో పడ్డారు.


ఈ ఘటన కాలిఫోర్నియాకు వెళ్తున్న టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో ‌చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈనెల 13వ తేదీన టర్కిష్ ఎయిర్ లైన్స్‌‌కు చెందిన టూకే79 విమానం ఇస్తాంబుల్ నుంచి శాన్‌ఫ్రాన్సిస్‌కోకు బయలుదేరింది. అయితే ఈ విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అప్రమత్తమైన సిబ్బంది అతడి దగ్గరకు వెళ్లేలోపే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈక్రమంలోనే విమానాన్ని ఇస్‌లాండ్‌లోని కెఫాలావిక్ విమానాశ్రయానికి మళ్లించేందుకు పైలెట్లు ప్రయత్నంచారు. కానీ అది కుదరకపోవడంతో షికాగో ఎయిర్ పోర్టుకు మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు.


ఆపై మృతదేహాన్ని కుక్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయానికి అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే మిగిలిన ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కల్గకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ విమాన ఏర్పాట్లు చేశారు. కానీ ఎగ్జామినర్ కార్యాలయ ప్రతినిధి నటాలియా డెరెవ్యానీ.. టర్కిష్ ఎయిర్ లైన్స్ నుంచి తమకు ఎలాంటి మృతదేహం లభించలేదని చెప్పారు. దీంతో విమానం ల్యాండింగ్ తర్వాత ఏం జరిగింది, అసలా మృతదేహం ఏమైందనే దానిపై అంతా ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విమానయాన సిబ్బంది సైతం చనిపోయింది ఎవరు, అతడి పేరేంటి వంటి వివరాలను వెల్లడించడం లేదు. దీంతో అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి.


సాధారణంగా విమానంలో ఎవరైనా ప్రయాణికులు మరణిస్తే.. విమానయాన సంస్థలు పాటించాల్సిన కొన్ని కఠినమైన ప్రోటోకాల్స్ ఉంటాయి. మృతదేహాన్ని ప్రత్యేకంగా భద్రపరచడం, గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత సంబంధిత అధికారులకు అప్పగించడం, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం వంటివి ఇందులో ఉంటాయి. అలాగే ముందుగా అందించిన సమాచారం మేరకు.. దీంతో విమానం దిగిన వెంటనే స్థానిక పోలీసులు, వైద్య సిబ్బంది, ఎయిర్‌లైన్ ప్రతినిధులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది.


అయితే ఈ ప్రక్రియలో ఎక్కడ పొరపాటు జరిగిందనేది ప్రస్తుతం ఎవరికీ అంతుపట్టడం లేదు. మృతదేహం ఎక్కడ మాయమైంది అనేదానిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విమానంలోనే ఎక్కడైనా ఉండిపోయిందా? లేదా ఏదైనా ల్యాండింగ్ పాయింట్ వద్ద తప్పుగా తరలించబడిందా? లేక మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa