ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు నితీశ్ కుమార్ రెడ్డి. ఐపీఎల్ 2024లో అదిరే ప్రదర్శన చేసిన ఈ 22 ఏళ్ల తెలుగు క్రికెటర్.. భారత్ తరఫున డెబ్యూ చేశాడు. టీ20, టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేసి సత్తాచాటాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ చేశాడు. అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అతడి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్ను అతడు వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఐపీఎల్ 2025లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తనకు సరైన స్థానం కల్పించలేదని నితీశ్ అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అతడు నాలుగో ప్లేస్లో బ్యాటింగ్కు రావాలని అనుకున్నాడని.. కానీ చివర్లో బ్యాటింగ్కు వెళ్లనివ్వడంతో నిరాశలో ఉన్నట్లు సోషల్ మీడియాలో పలువురు యూజర్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అతడు ఐపీఎల్ 2026కి ముందు సన్రైజర్స్ను వీడనున్నట్లు వివరించారు. దీంతో ఈ ప్రచారానికి నితీశ్ కుమార్ రెడ్డి తెరదించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.
“ఇలాంటి ప్రచారాలకు (సన్రైజర్స్ను వీడనున్నట్లు) నేను దూరంగా ఉంటాను. కానీ కొన్ని విషయాల్లో క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో నా బంధం నమ్మకం, గౌరవం అనే అంశాలతో ముడిపడి ఉంది. కొన్నేళ్లుగా అలాగే కొనసాగుతోంది. నేను ఎల్లప్పడూ సన్రైజర్స్ జట్టులోనే ఉంటాను. ఇందులో సందేహం లేదు,” అని నితీశ్ కుమార్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.
కాగా నితీశ్ కుమార్ రెడ్డి.. అండర్సన్, టెండూల్కర్ టెస్ట్ సిరీస్లో పాల్గొన్నాడు. కానీ జిమ్ చేస్తూ గాయపడి.. చివరి రెండు టెస్టులకు దూరమయ్యాడు. స్వదేశానికి తిరిగి వెళ్లాడు! ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో 2 మ్యాచ్లు ఆడిన నితీశ్.. 45 పరుగులు స్కోరు చేశాడు. బౌలింగ్లో మూడు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2025లో 13 మ్యాచ్లలో 22.75 సగటు, 118.95 స్ట్రైక్ రేట్తో కేవలం 182 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్లో 2 వికెట్లు మాత్రమే తీశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa