ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐఐటీ తిరుపతికి కేంద్రం నిధులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 29, 2025, 10:50 AM

ఐఐటీ తిరుపతిలో మౌలిక సదుపాయాల విస్తరణ కోసం ఫేజ్‌-2లో భాగంగా రూ.2,313.02 కోట్లు మంజూరు చేశామని కేంద్ర సహాయ మంత్రి సుకాంత మజుందార్‌ తెలిపారు. సోమవారం, లోక్‌సభలో టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి ఈ మేరకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ‘ఫేజ్‌-1లో భాగంగా ఐఐటీ తిరుపతి శాశ్వత క్యాంపస్‌ నిర్మాణానికి రూ.1,091.75 కోట్లు విడుదల చేశాం. ఈ క్యాంపస్‌ అక్టోబరు 2023 నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2014 తర్వాత ఏర్పాటైన ఐదు ఐఐటీల్లో విద్య, మౌలిక సదుపాయాల విస్తరణకు రూ.11,828.79 కోట్లు మంజూరు చేశాం’ అని మజుందార్‌ వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa