ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు.. వారికి మాత్రమే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 29, 2025, 09:29 PM

దివ్యాంగులు, వినికిడి లోపం ఉన్నవారికి ప్రభుత్వాలు అనేక రకాల కార్యక్రమాలు అమలు చేస్తుంటాయి. లోపం శాపం కాకూడదనే ఉద్దేశంతో వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా అనేక చర్యలు చేపడుతుంటాయి. ఈ క్రమంలోనే పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెషల్ సిస్టమ్ కింద వినికిడి లోపం ఉన్నవారికి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి స్మార్ట్ ఫోన్లు (టచ్ ఫోన్లు) పంపిణీ చేశారు. ఎనిమిది మంది లబ్ధిదారులకు 1.52 లక్షల విలువైన టచ్ ఫోన్లను ఏలూరు కలెక్టర్ పంపిణీ చేశారు. ఒక్కొక్కటి 19 వేలు విలువైన ఈ టచ్ ఫోన్లను గోదావరి మీటింగ్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో వినికిడి లోపం ఉన్న లబ్ధిదారులకు ఏలూరు కలెక్టర్ పంపిణీ చేశారు.


వినికిడి లోపం ఉన్నవారిలో కమ్యూనికేషన్, డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఈ టచ్ ఫోన్లను పంపిణీ చేశారు. అయితే ఇందుకు కనీసం ఇంటర్మీడియట్ స్థాయి విద్యను పూర్తి చేసి ఉండాలి. అలాగే ప్రభుత్వం నిర్దేశించిన అన్ని అర్హత ప్రమాణాలను కలిగి ఉండి.. సైన్ భాషలో ప్రావీణ్యం ఉన్నవారికి వీటిని అందించారు.


వినికిడి లోపం ఉన్న వారికి ఉచిత స్మార్ట్‌ఫోన్లు


మరోవైపు వినికిడి లోపంతో బాధపడుతున్న18 ఏళ్లు పైబడినవారికి ఉచితంగా స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నారు. అయితే లబ్ధిదారులు దారిద్య్రరేఖకు దిగువన ఉండాలి. అలాగే రేషన్ కార్డు కలిగి ఉండాలి. వీటితో పాటుగా కనీసం 40 శాతం వైకల్యం ఉన్నవారికి ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌లు అందిస్తున్నారు. మిగతావారితో పోలీస్తే వినికిడి లోపంతో ఉన్నవారిలో డిజిటల్ అంతరాన్ని తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో ఇదొక భాగం.


మరోవైపు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మంగళవారం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల గోడౌన్ సందర్శించారు. కలెక్టర్ ఆవరణలో ఉన్న గోడౌన్‌ను ఆమె పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన భద్రతాపరమైన చర్యలను పరిశీలించారు. సీసీటీవీ నిఘా వ్యవస్థ, గోడౌన్‌లో ఉన్న సేఫ్టీ సీల్స్ పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రమాణాలు, సూచనల మేరకు అన్నీ సరిగా ఉన్నాయా లేదా అనే వివరాలను పరిశీలించారు. అలాగే అగ్నిమాపక పరికరాలు ఏ విధంగా పనిచేస్తున్నాయనే విషయాన్ని ఏలూరు జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కలెక్టర్.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్ల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa