ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా జరిగే ఐదో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా తరఫున అర్షదీప్ సింగ్ అరంగేట్రం ఖాయమైనట్లు తెలుస్తోంది. నిజానికి అర్షదీప్ సింగ్ నాలుగో టెస్ట్లోని డెబ్యూ చేయాల్సింది. కానీ గాయం కారణంగా ఆ మ్యాచ్కు దూరమయ్యాడు. ప్రస్తుతం ఫిట్గా మారాడు. ఈ నేపథ్యంలో అతడిని ఐదో టెస్ట్లో ఆడించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. ఐదో టెస్ట్కు ముందు అతడు జోరుగా సాధన చేయడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.
ఐదో టెస్ట్కు జస్ప్రీత్ బుమ్రా దూరమవుతాడని తెలుస్తోంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే బుమ్రా తాను కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఆడతానని చెప్పాడు. దీంతో అతడి ప్లేసులో అర్షదీప్ సింగ్ తుది జట్టులోకి రావొచ్చు. ఒకవేళ బుమ్రా ఆడితే.. అన్షుల్ కాంబోజ్ ప్లేసులోనైనా అర్షదీప్ సింగ్ ఆడొచ్చు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల నైపుణ్యం ఉన్న ఈ లెఫ్ట్ ఆర్మర్ తుది జట్టులో చేరితే భారత బౌలింగ్ యూనిట్ మరింత పటిష్టంగా మారుతుందనే అంచనాలు ఉన్నాయి.
25 ఏళ్ల అర్షదీప్ సింగ్.. భారత టీ20 జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. అతడు ఇప్పటివరకు భారత్ తరఫున 63 టీ20లు, 9 వన్డే మ్యాచ్లు ఆడాడు. టీ20 ప్రపంచకప్ 2024లో టైటిల్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా కూడా ఉన్నాడు. ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఈ లెఫ్ట్ ఆర్మర్ కూడా చోటు సంపాదించాడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 19వ ఓవర్లో కేవలం నాలుగు రన్స్ మాత్రమే ఇచ్చి.. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఇక కుల్దీప్ యాదవ్ కూడా తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే స్పిన్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లను జట్టు నుంచి తీసే ప్రసక్తి లేదు. ఈ నేపథ్యంలో పేస్ ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ ప్లేసులో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి రానున్నాడు! జులై 31 నుంచి లండన్లోని ది ఓవల్ వేదికగా ఈ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa