మీరు ఈక్విటీ మార్కెట్ నుంచి మంచి రాబడులు అందుకోవాలని చూస్తుంటే మీకు వాల్యూ మ్యూచువల్ ఫండ్స్ ఒక విలువైన అవకాశాన్ని అందించగలవు. ఈ ఫండ్స్ వాటి అంతర్గత లేదా సరసమైన విలువ కంటే తక్కువ ట్రేడింగ్ చేస్తున్న మంచి స్టాక్లను గుర్తించి, వాటి విలువ అనుకున్న స్థాయికి పెరిగే వరకు వాటిని హోల్డ్ చేస్తాయి. దీంతో మంచి రాబడులు అందుకునేందుకు అవకాశం లభిస్తుంది. మీరు కూడా స్టాక్ మార్కెట్ల మంచి లాభాలను అందుకోవాలనుకుంటే ఈ ఫండ్స్ పరిశీలించవచ్చు. మరి వాల్యూ ఫండ్స్లోని టాప్-5 పథకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వాల్యూ ఫండ్స్ను ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్లుగా సెబీ నిర్వచించింది. ఈ పథకాలు వాల్యూ- ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని అనుసరిస్తాయి. ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత మార్గాల్లో 65 శాతం మేర పెట్టుబడులు పెడుతుంటాయి. ఇలా చేస్తూ మంచి రాబడులను రాబడుతుంటాయి. తక్కువ విలువ కలిగిన స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం వలన వృద్ధి ఆధారిత ఫండ్స్తో పోలిస్తే మెరుగైన మార్జిన్ను అందించగలవు.
జేఎం వాల్యూ ఫండ్ గత 10 సంవత్సరాల్లో హైరిటర్న్స్ అందించింది. ఈ స్కీమ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) రిటర్న్స్ XIRR 20.27 శాతంగా ఉంది. అంటే ఏడాదికి సగటున 20.27 శాతం రాబడులు ఇచ్చింది. దీని ప్రకారం నెలకు రూ.10 వేలు పొదుపు చేస్తూ ఉంటే 10 సంవత్సరాల్లోనే రూ.35 లక్షలు అవుతుంది. పెట్టుబడి రూ.12 లక్షలు మాత్రమే. సెక్టోరల్ ఫండ్గా దీనిని 1997 జూన్లో ప్రారంభించారు. ఆ తర్వాత 2018లో జేఎం వాల్యూ ఫండ్గా పేరు మార్చారు.
2010లో లాంచ్ చేసిన హెచ్ఎస్బీసీ వాల్యూ ఫండ్ సైతం మంచి రిటర్న్స్ అందించింది. గతంలో దీనిని L&T వాల్యూ ఫండ్ గా పిలిచేవారు. గత 10 సంవత్సరాల సిప్ రాపబడులు వార్షికంగా 20.10 శాతంగా ఉన్నాయి. దీని ప్రకారం రూ.10 వేల పొదుపు పదేళ్లలో రూ. 34.60 లక్షలు అవుతుంది.
నిప్పాన్ ఇండియా వాల్యూ ఫండ్ ను 2005, జూన్లో ప్రారంభించారు. ఈ స్కీమ్ సిప్ పెట్టుబడుల రాబడి గత 10 సంవత్సరాల్లో చూస్తే ఎక్స్ఐఆర్ఆర్ విలువ 19.7 శాతంగా ఉంది. దీని ప్రకారం నెలవారీ రూ.10 వేల పొదుపు 10 సంవత్సరాల్లోనే రూ.33.90 లక్షలు అయింది.
ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ వాల్యూ ఫండ్ 2004, ఆగస్టులో లాంచ్ చేశారు. వాల్యూ ఫండ్ కేటగిరీలోనే అతిపెద్ద ఫండ్గా చెప్తారు. గత పది సంవత్సరాల్లో ఈ స్కీమ్ సిప్ పెట్టుబడి వార్షిక రాబడులు 19.6 శాతంగా ఉన్నాయి. దీని ప్రకారం నెలకు రూ.10 వేల చొప్పున సిప్ పెట్టుబడి చేసి ఉంటే ఇప్పుడు ఆ విలువ రూ.33.70 లక్షలు అయి ఉండేది.
బంధన్ వాల్యూ ఫండ్ 2008, మార్చి నెలలో ప్రారంభించారు. దినిని ఇంతకు ముందు ఐడీఎఫ్సీ స్టెర్లింగ్ వాల్యూ ఫండ్ గా పిలిచే వారు. గత 10 సంవత్సరాల కాలంలో చూస్తే సిప్ రిటర్న్స్ సగటున వార్షిక రాబపడి 19.2 శాతంగా ఉన్నాయి. దీని ప్రకారం నెలకు రూ.10 వేల చొప్పున పెట్టుబడి పెడితే ఇప్పుడు ఆ విలువ రూ.33 లక్షల వరకు అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa