తూర్పు రష్యాలో బుధవారం సంభవించిన భారీ భూకంపం తాలూకు ప్రకంపనలు చుట్టుపక్కల దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. భూకంప తీవ్రత కారణంగా సముద్రం అలలతో ఉవ్వెత్తున ఎగిసిపడింది. దీని ప్రభావంగా పసిఫిక్ మహాసముద్ర తీరంలో ఉన్న దేశాలలో అప్రమత్తత నెలకొంది. ముఖ్యంగా జపాన్ తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ ప్రకంపనలతో జపాన్కు చెందిన పలు తీర ప్రాంతాల్లో సునామీ అలలు ఎగిసి పడినట్లు అధికారులు వెల్లడించారు. టొకచాయ్ పోర్టులో 40 సెం.మీ., ఎరిమో పట్టణంలో 30 సెం.మీ., మరియు ఇషినోమొకి పోర్టులో 50 సెం.మీ. ఎత్తులో అలలు నమోదయ్యాయి. ఇవి పెద్ద ప్రభావాన్ని చూపించకపోయినప్పటికీ, భద్రతా చర్యల్లో భాగంగా ప్రజలకు ముందస్తు హెచ్చరికలు అందజేయడం జరిగింది.
సునామీ హెచ్చరికల నేపథ్యంలో జపాన్ అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. జపాన్లోని సెండాయ్ ఎయిర్పోర్ట్ను తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పరిస్థితిని నియంత్రణలో ఉంచేందుకు జపాన్ అధికార యంత్రాంగం యత్నిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa