రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 8.8 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం కారణంగా పసిఫిక్ తీరంలో సునామీ విరుచుకుపడింది. జపాన్ ఉత్తర హొక్కైడో ద్వీపం, రష్యా కురిల్ దీవులను రాకాసీ అలలు ముంచెత్తాయి. అలలు ఎగిసిపడటంతో సముద్రతీర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకున్నాయి. ఈ విపత్తు నేపథ్యంలో న్యూ బాబా వంగాగా గుర్తింపు పొందిన జపాన్ కళాకారిణి జోస్యం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రియో టాట్సుకి 1999లో ప్రచురించిన మంగా “ది ఫ్యూచర్ ఐ సా’మళ్లీ చర్చలకు దారి తీసింది. అందులో ఆమె 2025 జులై 5న జపాన్లో భారీ విపత్తు సంభవిస్తుందని అంచనా వేశారు. అయితే, ఆ తేదీన ఎలాంటి విపత్తు సంభవించకపోవడంతో చాలామంది ఊపిరి పీల్చుకున్నారు కానీ, జులై 29న భారీ భూకంపం సంభవించి సునామీ విరుచుకుపడింది. ‘ఆమె చెప్పినట్టు జులై నెలంతా విపత్తులేనా?’ అన్న సందేహం మళ్లీ మొదలైంది.
సోషల్ మీడియాలో మరోసారి ‘July5Disaster’ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. పలువురు నెటిజన్లు ‘తేదీ కచ్చితంగా కాదేమో గానీ, ఆమె చెప్పిన భవిష్యవాణిని తోసిపుచ్చలేం’ అంటూ పోస్ట్లు పెడుతున్నారు. టాట్సుకి గతంలో 2011 సునామీ గురించి కూడా హెచ్చరించడంతో ఆమె జోస్యం పట్ల ప్రజల ఆసక్తి పెరిగింది కాగా, ఈ ఊహాగానాలతో జూన్ చివరి వారం నుంచి జూలై ప్రారంభం వరకు హాంకాంగ్ నుంచి జపాన్కు విమానాల బుకింగ్స్ 83 శాతం మేర తగ్గిపోయినట్టు విమానయాన సంస్థలు వెల్లడించాయి. భయంతో వేలాది మంది జపాన్ పర్యటనలు రద్దు చేసుకున్నారు.
అయితే ఈ జ్యోతిష అంచనాలను శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. టోక్యో యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సెకియా నావోయా మాట్లాడుతూ.. ఈ రకమైన జోస్యం శాస్త్రీయంగా చెల్లవని స్పష్టం చేశారు. ‘భూకంపాలను ఖచ్చితంగా ముందుగానే అంచనా వేయడం అసాధ్యం. ఇవి పూర్తిగా భౌగోళిక శాస్త్రీయ విధానాల ద్వారా మాత్రమే అధ్యయనం చేయాలి’’ అని అన్నారు. అటు, జపాన్ ప్రభుత్వ అధికారులు కూడా.. జులై 5 విపత్తు గురించి భయపడొద్దని, టాట్సుకి అంచనాలకు శాస్త్రీయ ఆధారాలు లేవని ప్రకటించారు. కాగా, బల్గేరియాకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాంజెలియా పాండేవా గుష్టెరోవా అలియాస్ బాబా వంగా జోస్యంపై కూడా ఐరోపాలో నమ్మకం ఎక్కువ.
టాట్సుకీ ‘The Future I Saw’ అనే పుస్తకం 1999లో ప్రచురితమైంది. ఇందులో ఆమె భవిష్యత్తులో జరగబోయే పలు విపత్తుల గురించి అంచనాలు వేశారు. వాటిలో కొన్ని సమకాలీన సంఘటనలతో ముడిపెట్టి. కొంతమంది నిజమని భావిస్తున్నారు. 2011లో జపాన్లో వచ్చిన తోహోకు భూకంపం, సునామీ, ఫుకుషిమా దైచీ అణు విపత్తు, బ్రిటన్ యువరాణి డయానా, ఫ్రెడ్డీ మెర్క్యురీ మరణాలు, కోవిడ్-19 మహమ్మారి గురించి కూడా ఆమె కచ్చితంగా అంచనా వేయడం గమనార్హం. అంతేకాదు, 2030లో కరోనా మళ్లీ జృంభిస్తుందని, తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa