ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌కి మరోసారి ట్రంప్ హెచ్చరిక – భారీ సుంకాలు, జరిమానాల ప్రకటన

international |  Suryaa Desk  | Published : Wed, Jul 30, 2025, 11:01 PM

భారత్‌పై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ప్రకటించిన విషయం తెలిసిందే. పెనాల్టీతో కలిపి ఆగస్టు 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నట్లు చెప్పారు.
గడియ గడియకో సంచలన ప్రకటనతో వార్తలలో నిలిచే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మరోసారి ఆగ్రహం వెళ్లగక్కారు. తాజా వ్యాఖ్యలతో భారత్‌పై 25 శాతం దిగుమతి సుంకాలు మరియు అదనపు జరిమానా విధించనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ కొత్త ఆంక్షలు ఆగస్టు 1వ తేదీ (శనివారం) నుంచి అమల్లోకి రానున్నాయని ట్రంప్ తన స్వంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్’ లో వెల్లడించారు.“భారత్ మనకు మిత్రదేశమే అయినా, మేము వారితో వ్యాపారం తక్కువగానే చేస్తున్నాం,” అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇందుకు కారణంగా భారతదేశం తమ ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకాలు, అలాగే ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ద్రవ్యేతర వాణిజ్య నియమాలు అమలు చేయడాన్ని పేర్కొన్నారు.అంతేకాక, “భారత్ ఎక్కువగా రష్యా నుండి సైనిక సామాగ్రిని కొనుగోలు చేస్తోంది. అమెరికా వస్తువులపై అధిక సుంకాలు విధిస్తోంది,” అని గతంలో చేసిన ఆరోపణలను మళ్లీ గుర్తు చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో భారత్, చైనా లాంటి దేశాలు రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం కూడా ట్రంప్‌కు ఆగ్రహానికి కారణమైంది.“ఇది మంచిది కాదు,” అంటూ ఆయన అభిప్రాయపడ్డారు. అందువల్లే భారత్‌పై 25 శాతం సుంకాలతో పాటు అదనంగా జరిమానా విధించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. “అమెరికాను మళ్లీ గొప్పగా చేయాలి (Make America Great Again),” అంటూ ఆయన తన వ్యాఖ్యలను ముగించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa