సెప్టెంబర్ 9 నుంచి జరగనున్న ఆసియాకప్ 2025కి సంబంధించి వేదికలు ఖరారు అయ్యాయి. ఇదివరకే షెడ్యూల్ విడుదల కాగా.. వేదికలు మాత్రం ప్రకటించలేదు. తాజాగా పూర్తి షెడ్యూల్ను ఖరారు చేసేందుకు సమావేశమైన ఆసియా క్రికెట్ కౌన్సిల్ .. దుబాయ్, అబుదాబీ వేదికగా ఈ టోర్నీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు పూర్తి షెడ్యూల్ను ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 14న జరగనుంది.
నిజానికి ఈ టోర్నీ భారత్ వేదికగా జరగాల్సి ఉంది. కానీ భారత్, పాక్ ఉద్రిక్తతల మధ్య ఆతిథ్య హక్కులు ఉన్న బీసీసీఐ.. దుబాయ్లో ఈ టోర్నీ నిర్వహించాలని డిసైడ్ అయింది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరుగనుంది. ఇక ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 కోసం సన్నాహాలకు అనుగుణంగా ఆసియా కప్ 2025 కూడా టీ20 ఫార్మాట్లోనే జరగనుంది. ఆసియా కప్ 2025లో భారత్ సహా మొత్తం ఎనిమిది దేశాలు పాల్గొననున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టీమిండియా బరిలోకి దిగనుంది. ఫైనల్తో కలిపి మొత్తం 19 మ్యాచ్లు జరుగుతాయి.
ఏ గ్రూప్లో ఎవరు?
8 టీమ్లను రెండు గ్రూప్లుగా విభజించారు.
గ్రూప్ ఏ: భారత్, పాకిస్థాన్, యూఏఈ, ఒమన్
గ్రూప్ బి: శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్, హాంకాంగ్
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే..?
గ్రూప్ స్టేజ్లో సెప్టెంబరు 14న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ టోర్నీలో మొత్తంగా ఇండో, పాక్ మూడు సార్లు తలపడే అవకాశం ఉంది. ఎందుకంటే సూపర్-4కు చేరుకునే 4 జట్లు మిగతా జట్లతో మ్యాచ్ ఆడతాయి. ఈ లెక్కన గ్రూప్ ఏ నుంచి భారత్, పాక్.. సూపర్-4కి చేరితే.. అక్కడ మరోసారి తలపడతాయి. సూపర్-4లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఫైనల్ జరుగుతుంది. ఈ రెండు జట్లే ఫైనల్ చేరితే సెప్టెంబర్ 28న మరోసారి భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది.
ఆసియా కప్లో టీమిండియా షెడ్యూల్..
10 సెప్టెంబర్: భారత్ - యూఏఈ (దుబాయ్)
14 సెప్టెంబర్: భారత్ - పాకిస్థాన్ (దుబాయ్)
19 సెప్టెంబర్: భారత్ - ఒమన్ (అబుదాబీ)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa