ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింహాద్రి అప్పన్న నిత్యాన్నదానం తనఖీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 05, 2025, 06:06 PM

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానంలో మంగళవారం ఆలయ కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాథరావు అప్పన్న నిత్య అన్న ప్రసాదాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్న ప్రసాదం స్వీకరిస్తున్న భక్తులతో నేరుగా మాట్లాడి, అన్న ప్రసాదం రుచి, నాణ్యత గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా భక్తులు అన్న ప్రసాదం చాలా బాగుందని చెప్పడంతో ఈఓ సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే, భక్తులకు వడ్డించే సాంబార్, మజ్జిగ, కూరలను ప్రత్యేకంగా పరిశీలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa