ఒంటిమిట్ట మండలంలోని జడ్పీటీసీ ఉపఎన్నిక పోలింగ్ సమయంలో ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ బూత్ నం.4లో వైకాపా నేతలు అక్రమంగా చొరబడి, విధులు నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శి నల్ల వెంకట సుబ్బయ్యపై దాడికి తెగబడ్డారు.
ఈ ఘటన కారణంగా అక్కడ స్వల్పకాలిక ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కార్యకర్తలు దాడిని తీవ్రంగా ఖండించడంతో పాటు పోలీసులు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై అధికారులు ఫిర్యాదు తీసుకుని విచారణ ప్రారంభించినట్టు సమాచారం.
మరోవైపు, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నిక ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని మదనపల్లె డీఎస్పీ మహేంద్ర తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు సమర్థవంతమైన బందోబస్తు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని, ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను సహించబోమని డీఎస్పీ స్పష్టం చేశారు. ఏవైనా ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa