పెద్దగా ప్రభావం లేదు: అనంత నాగేశ్వరన్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన టారిఫ్ల ప్రభావాన్ని ఇప్పుడే అంచనావేయడం తగదని, ఇది తొందరపాటు నిర్ణయమవుతుందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ డాక్టర్ వి. అనంత నాగేశ్వరన్ స్పష్టం చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై అమెరికా విదేశాంగ విధాన పరంగా ఒత్తిడికి గురవుతున్నా, ఆర్థికంగా దాని ప్రతికూల ప్రభావం స్పష్టంగా కనిపించదన్నారు.
ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది
ఇప్పటి వరకు భారత ఆర్థిక వ్యవస్థ మందగమన సంకేతాలు చూపలేదని పేర్కొన్నారు. దేశీయంగా వినియోగం, పెట్టుబడులు స్థిరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. దీంతో 2025–26 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు 6.3 నుంచి 6.8 శాతం మధ్య నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు.
పాజిటివ్ ఫండమెంటల్స్ భారత ప్లస్ పాయింట్
భారతదేశంలో రాజకీయ స్థిరత, విశాలమైన వినియోగదారుల మార్కెట్, పెరుగుతున్న యువ జనాభా, బలమైన శ్రామిక శక్తి వంటి అంశాలు భారత్ను తయారీ రంగానికి గమ్యస్థానంగా మారుస్తున్నాయని వెల్లడించారు. "ఇవి దేశ ఆర్థిక వ్యవస్థ బలాన్ని సూచిస్తున్న ముఖ్యమైన సంకేతాలు" అని ఆయన వ్యాఖ్యానించారు.
భవిష్యత్తులో పెట్టుబడులకు భారత్ అనుకూలం
భారత దేశం విదేశీ పెట్టుబడులకు చక్కటి గమ్యస్థానంగా మారుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. గ్లోబల్ తయారీ కంపెనీలు భారత్ను తమ కొత్త కేంద్రంగా భావించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు. వాస్తవానికి ఇది భారత్కు ఉన్న దీర్ఘకాలిక బలాల ప్రతిఫలమేనని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa