ప్రతిష్టాత్మక ఆసియా కప్ ఈ సంవత్సరం సెప్టెంబర్ 9 నుంచి 28వ తేదీ వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా జరగనుంది. ఈసారి టోర్నమెంట్ టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు.అఫ్గానిస్తాన్ మరియు హాంకాంగ్ జట్ల మధ్య పోరుతో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. భారత్ తన తొలి మ్యాచ్ను సెప్టెంబర్ 10న యుఏఈ జట్టుతో ఆడనుంది. ఈ నేపథ్యంలో, బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ నేతృత్వంలో జట్టును ఆగస్టు 19 లేదా 20న ప్రకటించే అవకాశం ఉంది. అయితే, అందుతున్న సమాచారం ప్రకారం శుభ్మన్ గిల్కు ఈ జట్టులో చోటు దక్కకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఇటీవలి కాలంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన తెందూల్కర్-అండర్సన్ ట్రోఫీ సిరీస్ను 2-2తో సమం చేసుకుంది. ఈ సిరీస్ తర్వాత రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఇద్దరూ తక్కువ వ్యవధిలోనే టెస్టు ఫార్మాట్కి రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో, టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్గా శుభ్మన్ గిల్ను నియమించారు.ఈ సిరీస్లో గిల్ అత్యుత్తమంగా రాణించాడు. సగటు 75.40తో 754 పరుగులు సాధించి, నాలుగు సెంచరీలు బాదాడు. బర్మింగ్హామ్ టెస్టులో 269 పరుగులతో డబుల్ సెంచరీ చేసి, టాప్ స్కోరర్గా నిలిచాడు.అయితే, ఈ అద్భుత ప్రదర్శన ఉన్నప్పటికీ, గిల్కు ఆసియా కప్ టీ20 జట్టులో చోటు దక్కకపోవచ్చు. దీనికి కారణంగా, సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా టీ20 యూనిట్ ఇప్పటికే స్థిరపడిపోయిందని, సెలెక్టర్లు పెద్దగా ప్రయోగాలు చేయడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.ఇక టీ20 ఓపెనింగ్ జోడీగా సంజు శాంసన్ మరియు అభిషేక్ శర్మ ఇప్పటికే ఆకట్టుకుంటున్నారు. వీరిద్దరి ఫామ్ బాగుండటంతో, సెలెక్టర్లు కొత్త ఓపెనర్లకు అవకాశం ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నారు. అలాగే మిడిల్ ఆర్డర్లో కూడా గట్టి పోటీ ఉంది.ఇక మరో యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ కూడా ఈ సారి అవకాశం కోల్పోయే అవకాశముందని సమాచారం. రెడ్ బాల్ క్రికెట్ పై దృష్టి పెట్టాలని అతడికి సెలెక్టర్లు సూచించినట్టు తెలుస్తోంది.అలాగే, శ్రేయస్ అయ్యర్ మరియు కేఎల్ రాహుల్ వంటి సీనియర్ ఆటగాళ్లకు కూడా ఈ సారి టీ20 జట్టులో అవకాశం దక్కకపోవచ్చు. ఏం జరుగుతుందన్నది జట్టు అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే స్పష్టమవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa