తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో 2020లో చోటుచేసుకున్న ఘర్షణ తర్వాత భారత్-చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ సంఘటన అనంతరం ఇరు దేశాల మధ్య విశ్వాస లోపం ఏర్పడింది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ఇప్పుడు ఇరుదేశాలు దౌత్య సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.
ఈ క్రమంలో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యి (Wang Yi) భారత్ను సందర్శించనున్నట్టు చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఆయన ఈ నెల 18 నుండి 20 వరకు మూడు రోజులపాటు భారత్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరుదేశాల మధ్య జరుగుతున్న ముఖ్యమైన రాజకీయ మరియు దౌత్య పరమైన ముందడుగు అని విశ్లేషకులు భావిస్తున్నారు.
వాంగ్ యి పర్యటనలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో చర్చలు జరగనున్నాయి. ప్రధానంగా భారత్-చైనా సరిహద్దు సమస్యలు, వివాదాస్పద ప్రాంతాల పరిష్కారం, ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ వంటి అంశాలపై చర్చలు సాగనున్నాయి.
ఇరు దేశాల మధ్య స్థిరమైన సంభాషణ కొనసాగడం, భవిష్యత్లో మరింత శాంతియుత పరస్పర సంబంధాలకు దారితీయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాణిజ్య సంబంధాలు, ప్రాంతీయ శాంతి, భద్రత అంశాలలో సుదీర్ఘ కాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఇది ఒక గొప్ప అవకాశంగా చూడవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa