ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతి రాజధాని ప్రాజెక్టుకు కొత్త జీవం – విన్ గ్రూప్ భారీ ప్రణాళిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 16, 2025, 08:57 PM

అమరావతి నిర్మాణ యోచనలో కీలక మార్పు – సింగపూర్ బదులు ఇప్పుడు వియత్నాం ముందుకు వస్తోంది.
2018లో అమరావతిలో స్టార్ట్‌అప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్ ముందుకు వచ్చినప్పటికీ, తరువాతి కాలంలో గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం నుంచి తప్పుకుంది. అప్పట్లో సింగపూర్‌కు, సీఆర్డీఏ (CRDA)కి మధ్య 1,679 ఎకరాల స్టార్ట్‌అప్ జోన్ అభివృద్ధిపై ఒప్పందం జరిగింది.ఇప్పుడు, తాజా పరిణామాల్లో వియత్నాం ఆధారిత 'విన్ గ్రూప్' సంస్థ, అమరావతిలో 2,000 ఎకరాల స్టార్ట్‌అప్ ఏరియాను అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చింది.ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై విన్ గ్రూప్ సీఈఓ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, స్టార్ట్‌అప్ ఏరియా అభివృద్ధిపై సమగ్ర ప్రతిపాదనలు సీఎం ముందు ఉంచారు.ప్రతిపాదనలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, గతానికి భిన్నంగా, మరింత ప్రాధాన్యతతో అమరావతిలో స్టార్ట్‌అప్ జోన్ అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తున్నారు. విన్ గ్రూప్ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే, CRDAతో అధికారిక ఒప్పందం చేసేందుకు ముందుకు వెళ్లనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa