ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో దర్శనం కోసం భక్తుల పరుగులు.. వాళ్లే కారణమట

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 18, 2025, 03:53 PM

తిరుమలలో భక్తుల రద్దీ కనిపిస్తోంది.. వీకెండ్‌తో పాటుగా వరుసగా మూడు రోజుల పాటూ సెలవులు రావడంతో కొండపై రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి కృష్ణ తేజ గెస్ట్‌హౌస్ వరకు క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. టోకేన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోందని చెబుతున్నారు. రూ.300 దర్శనానికి 3-4 గంటల సమయం.. సర్వ దర్శనం టోకెన్ పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుంది. ఆదివారం శ్రీవారిని 86,364 మంది భక్తులు దర్శించుకున్నారు.. 30,712 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.46 కోట్లు వచ్చిది.


తిరుమలలో భక్తుల రద్దీపై ఓ వీడియో వైరల్ అయ్యింది.. ' తిరుమలలో భక్తులు పరుగులు .. శనివారం ఉదయం (ఆగస్టు 16న) నుంచి క్యూ లైన్లలో ఉన్న భక్తులు.. టీటీడీ తికమక ప్రకటనతో దర్శనానికి రోడ్డుపై భక్తులు పరుగులు.. తొక్కిసలాట లాంటి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు నారా చంద్రబాబు నాయుడు?' అంటూ కొందరు ఓ వీడియోను ట్వీట్ చేయడంతో వైరల్ అయ్యింది. తిరుమలలో వీడియో వైరల్ కావంతో ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ఈ వీడియోకు సంబంధించి ఏం జరిగిందో వివరణ ఇచ్చింది.. తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.


'ఆగస్టు 16వ తేదీ శనివారం ఉదయం తిరుమలలో భక్తులు పరుగులు తీసారని... టీటీడీ చేసిన తికమక ప్రకటనే దానికి కారణమని... తొక్కిసలాట జరిగితే ఎవరు బాద్యులని ప్రశ్నిస్తూ ఒక ఫేక్ వీడియో పెట్టి కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. అది కేవలం ఫేక్ వీడియో. వరుస సెలవుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఫలితంగా ఎక్కడా భక్తులు గందరగోళానికి గురి కావడం కానీ, పరుగులు పెట్టడం కానీ జరగలేదు. ఆగస్టు 16 వ తేదీ నాటి వాస్తవ వీడియో చూసిన వారెవరికైనా అక్కడ భక్తులెవరూ ప్రమాదకరంగా పరుగులు పెట్టలేదని.. క్యూ లైన్లలో సాఫీగా వెళ్ళి దర్శనం చేసుకున్నారని అర్ధం అవుతుంది. తిరుమల విషయంలో కొందరు కావాలనే ఇటువంటి ఫేక్ ప్రచారాలకు దిగుతూ, భక్తులను భయబ్రాంతులకు గురిచేస్తూ.. వారి మనోభావాలను రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నారు. స్వామి పై నమ్మకం లేని కొందరు చేస్తున్న కుట్ర ఇది. అటువంటి వారిని ప్రభుత్వం ఉపేక్షించదు. చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటుంది' అని ఫ్యాక్ట్ చెక్ టీమ్ హెచ్చరించింది. మొత్తం మీద తిరుమలలో వీడియోపై ఫ్యాక్ట్ చెక్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa