సిక్సర్ల కింగ్ రింకూ సింగ్ .. కొత్త అవతారంలో కనిపించాడు. ఇన్నాళ్లు బ్యాటింగ్లో మాత్రమే అదరగొట్టిన రింకూ సింగ్.. తాజాగా బౌలర్గా మారిపోయాడు. సిక్సర్ల కింగ్ కాస్తా.. బౌలర్గా మారిపోయాడు. సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న యూపీ టీ20 లీగ్లో అతడు బౌలర్గా మారిపోయాడు. ఏకంగా వికెట్ కూడా తీశాడు. ఆపై అదిరిపోయే రీతిలో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
యూపీ టీ20 లీగ్లో రింకూ సింగ్.. మీరట్ మెవరిక్స్ తరఫున ఆడుతున్నాడు. లీగ్లో భాగంగా మీరట్ మెవరిక్స్ జట్టు.. కాన్పూర్ స్టయికర్స్తో తలపడింది. ఈ మ్యాచ్లో రింకూ సింగ్.. 2 ఓవర్లు స్పిన్న బౌలింగ్ వేశాడు. ఇందులో బ్యాటర్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. వికెట్ తీసిన తర్వాత గట్టిగా అరిచి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎప్పుడూ బ్యాటర్గా కనిపించే రింకూ.. కొత్త అవతారంలో కనిపించడంపై ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కాగా టీమిండియా త్వరలో ఆసియాకప్ 2025లో ఆడనుంది. ఇందుకోసం మంగళవారం సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించనుంది. అయితే ఈ జట్టులో సిక్సర్ల కింగ్.. రింకూ సింగ్కు చోటు దక్కుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం టీమ్ మేనేజ్మెంట్ ఆల్రౌండర్లపై ఎక్కువ ఫోకస్ చేస్తోంది. అవసరమైతే బ్యాటింగ్ లేదా బౌలింగ్లో సత్తాచాటే ఆటగాళ్లు తుది జట్టులో ఉండాలని కోరుకుంటోంది. దీంతో స్పెషలిస్ట్ బ్యాటర్లు, స్పెషలిస్ట్ బౌలర్ల కంటే కూడా ఆల్రౌండర్లకే ఎక్కువ డిమాండ్ ఏర్పడింది.
ఈ పరిస్థితులను గమనించిన తర్వాత రింకూ సింగ్ కూడా.. తన బౌలింగ్ స్కిల్స్ పెంచుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇలా రాణిస్తేనే.. టీమిండియా తుది జట్టులో చోటు ఖరారు అవుతుందని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. మరి రింకూ సింగ్.. ఇలాగే బౌలింగ్ కూడా చేయడం కొనసాగిస్తాడా? లేదా.. ఇది కేవలం ఒక్క మ్యాచ్కే పరిమితమా అనేది తేలాల్సి ఉంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రింకూ సింగ్ మీరట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం కాన్పూర్ టీమ్ను 139/9కి పరిమితం చేసింది. 86 పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసింది రింకూ సింగ్ టీమ్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa