ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి బంగారం ధరలు చూసి షాక్ అవ్వాల్సిందే.. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్!

national |  Suryaa Desk  | Published : Mon, Aug 18, 2025, 08:56 PM

పసిడి ప్రియులకు ఇది నిజంగా శుభవార్తే! గత కొన్ని రోజులుగా ఊగిసలాటగా మారిన బంగారం ధరలు, గత వారం తక్కువవైపు మొగ్గు చూపడంతో గోల్డ్ ప్రేమికులు ఊపిరి పీల్చుకున్నారు.ట్రంప్ విధించిన సుంకాల ప్రభావంతో బంగారం ధరలు భారీగా పెరిగే ప్రమాదముందని భావించినా, ఆశించినట్లుగా పెరగకుండా తగ్గుతూ రావడంతో, పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వారం ప్రారంభానికి ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. ప్రస్తుతం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
*24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.1,02,400 వద్ద ట్రేడ్ అవుతోంది.
*22 క్యారెట్ల ధర రూ. 93,100 వద్ద ఉంది.
*18 క్యారెట్ల ధర రూ. 75,890 వద్ద స్థిరంగా ఉంది.
ఇదిలా ఉండగా, వెండి ధర మాత్రం ఊహించని విధంగా పెరిగింది. కేవలం ఒకరోజులోనే కేజీ వెండిపై రూ.800 వరకు పెరుగుదల చోటుచేసుకుంది. ప్రస్తుతం వెండి ధర రూ.1,17,390 వద్ద కొనసాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa