ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్క కిలోమీటరు దూరానికి రూ.రూ.425..ఇది మామూలు ఆటో కాదు

national |  Suryaa Desk  | Published : Tue, Aug 26, 2025, 06:03 PM

గ్రామాల్లు, ఓ మోస్తరు పట్టణాల్లో ఆటో ఛార్జీలు బస్ ఛార్జీలతో సమానంగా ఉంటాయి. పెద్దగా ఇబ్బంది అనిపించదు. కానీ మెట్రో నగరాల్లో మాత్రం ఆటో ఎక్కాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. చిన్న చిన్న దూరాలకు కూడా వందల్లో వసులూ చేసి ప్రయాణికుల జేబుకు చిల్లు పెడుతుంటాయి. పలు రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తుండటంతో.. ఆటోలకు డిమాండ్ భారీగా తగ్గింది. దీంతో ఛార్జీల విషయంలో కాస్త దిగి వస్తున్నాయి. కానీ తాజాగా ఓ చోట మాత్రం ఆటో ఛార్జీలు ప్రయాణికులకు హార్ట్ ఎటాక్ తెప్పించే విధంగా ఉన్నాయి. ఒక్క కిలోమీటరు దూరానికి ఏకంగా 425 రూపాయలు ఛార్జ్ అనడం సంచలనంగా మారింది. ఆ వివరాలు..


ప్రస్తుతం మెట్రో నగరాలైన హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో క్యాబ్, ఉబర్ , ర్యాపిడో సేవలు అందుబాటులో ఉన్నాయి. సాధారణ రోజుల్లో వీటిల్లో ఛార్జీలు మాములుగానే ఉన్నా వర్షం పడితే మాత్రం.. ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతాయి. తాజాగా బెంగళూరులో ఇదే పరిస్థితి ఎదురయ్యింది. మామూలుగానే బెంగళూరులో భారీ ట్రాఫిక్ ఉంటుంది. కార్లు, బస్సుల్లో ప్రయాణం చేసే వారి పరిస్థితి వర్ణించడానికి కూడా వీలుండదు. మన అదృష్టం బాగాలేక వర్షం పడిందా.. గంటలు గంటలు రోడ్ల మీద పడిగాపులు కాయాల్సిందే. ఆ సమయంలో బస్సుల్లో వెళ్లలేక ఉబర్ వంటి వాటిని ఆశ్రయించామా.. జేబుకు చిల్లు పక్కా.


బెంగళూరులో వర్షం పడితే చాలు ఉబర్ ఆటో కిలోమీటరు దూరానికే వందల రూపాయలు వసూలు చేస్తూ ప్రయాణికులను బెంబెలేత్తిస్తుంది. తాజాగా ఓ ప్రయాణికుడికి ఉబర్ ఆటో షాకిచ్చింది. కేవలం ఒక్క కిలోమీటర్ దూరానికి 425 రూపాయలు ఛార్జ్ చూపించి.. కోలుకోలేని షాకిచ్చింది. దీని గురించి అతడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్‌గా మారింది.


బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి.. సాయంత్రం వర్షం పడుతుండటంతో ఇంటికి వెళ్లడం కోసం క్యాబ్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అది చాలా టైం తీసుకోవడంతో ఉబర్ ఆటో ప్రయత్నించాడు. ఇక ఒక్క కిలోమీటర్ దూరంలో ఉన్న అతడి ఇంటికి ఉబర్ ఆటో 425 రూపాయల ఛార్జ్ చూపించింది. ఇది చూసి షాక్ అయిన అతడు.. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని రెడ్డిట్‌లో పోస్ట్ చేశాడు. మా ఇంటికి వెళ్లడం ఇంత ఖరీదైన వ్యవహారం అవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదంటూ క్యాప్షన్ పెట్టాడు. ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.


దీనిపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆటో ఛార్జీనా లేక ఫ్లైట్ టికెట్ ధరనా అని ప్రశ్నిస్తున్నారు. ఇంత ఎక్కువ ధర పెడితే సామాన్యులు ఎలా ప్రయాణించగలరు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే.. ఆ 425 రూపాయలు ఆటో అతడికి ఇచ్చే బదులు ఓ గొడుకు కొనుక్కుని.. ఎంచక్కా నడుచుకుంటూ పోయేవాడిని. గొడుగు మిగిలేది.. డబ్బు ఆదా.. వ్యాయామం కూడా చేసినట్లు ఉండేదని కామెంట్ చేశాడు. బెంగళూరు లాంటి మహానగరంలో రద్దీ సమయాల్లో ఇంకా వర్షం పడుతున్నప్పుడు ప్రైవేట్ రవాణా ఛార్జీలు చాల ఎక్కువగా ఉంటాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa