రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్ల కోసం ప్రభుత్వం చేపడుతున్న రీ-వెరిఫికేషన్ ప్రక్రియ వారి ప్రాణాల మీదకు తెస్తోందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తీవ్ర ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వ వైఖరి కారణంగానే దివ్యాంగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుకు శాపనార్థాలు పెట్టారు. పెన్షన్ పొందాలంటే దివ్యాంగులు తమ అంగవైకల్యాన్ని మళ్లీ నిరూపించుకోవాలని ప్రభుత్వం చెప్పడం దారుణమని ఆమె మండిపడ్డారు. కళ్లెదుట కనిపిస్తున్న వైకల్యాన్ని రీ-వెరిఫికేషన్ పేరుతో అవమానించడం సరికాదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ తీరు వారిని మానసికంగా తీవ్ర క్షోభకు గురిచేస్తోందని అన్నారు.ఇటీవల పల్నాడు జిల్లా ముప్పాళ్ల గ్రామంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద రామలింగారెడ్డి అనే దివ్యాంగుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనను ఆమె గుర్తుచేశారు. అలాగే, కొద్ది రోజుల క్రితం మరో దివ్యాంగుడి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.ప్రభుత్వంలో చలనం రావాలంటే ఇంకా ఎంతమంది దివ్యాంగులు ప్రాణాలు అర్పించాలని ఆమె ప్రశ్నించారు. "దివ్యాంగులతో ఆటలా చంద్రబాబు గారూ, ఈ పాపం మిమ్మల్ని ఊరికే వదలదు" అంటూ ఆమె తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే ఈ వేధింపులు ఆపి, దివ్యాంగులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa