ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్కెట్లోకి ఐపీఓల గ్రాండ్ ఎంట్రీ.. 20 శాతం ప్రీమియంతో పటేల్ రిటైల్

business |  Suryaa Desk  | Published : Tue, Aug 26, 2025, 10:56 PM

ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లలోకి నాలుగు మెయిన్ బోర్డ్ ఐపీఓలు ఎంట్రీ ఇచ్చాయి. పటేల్ రిటైల్ ఐపీఓ అత్యధికంగా 20 శాతం లాభాలు అందించింది. ఇక విక్రమ్ సోలార్ కంపెనీ షేర్లు 2 శాతం ప్రీమియంతో ఫ్లాట్‌గా లిస్టైనప్పటికీ ఆ తర్వాత 14 శాతం మేర ర్యాలీ చేశాయి. ఇక శ్రీజి షిప్పింగ్, జెమ్ ఏరోమాటిక్స్ స్టాక్స్ స్వల్ప లాభాలతో ట్రేడింగ్ చేశాయి. వీటితో పాటు ఇవాళ మరో రెండు కంపెనీల ఐపీఓలు సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులోకి వచ్చాయి. ఈ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


పటేల్ రిటైల్ ఐపీఓ గ్రాండ్ ఎంట్రీ


ఈ రోజు పటేల్ రిటైల్ కంపెనీ ఐపీఓ లిస్టింగ్ అయింది. మార్కెట్లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చి ఇన్వెస్టర్లకు మంచి లాభాలు అందించిది. ఈ పబ్లిక్ ఇష్యూ ధర రూ. 255గా ఉండగా బీఎస్ఈలో 20 శాతం ప్రీమియంతో రూ. 305 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఎన్ఎస్ఈలో 18 శాతం ప్రీమియంతో రూ. 300 వద్ద లిస్టైంది. అయితే ఆ తర్వాత ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్స్‌ చేపట్టడంతో స్టాక్ స్వల్పంగా క్షీణించింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో రూ. 290 వద్ద స్థిరపడింది.


విక్రమ్ సోలార్ షేర్లు స్టాక్ మార్కెట్లో ఫ్లాట్‌గా లిస్ట్ అయ్యాయి. పబ్లిక్ ఇష్యూ ధర రూ. 332 వద్ద ఉండగా బీఎస్ఈలో రూ. 340 వద్ద ట్రేడింగ్ మొదలు పట్టింది. ఇది కేవలం 2.41 శాతం ప్రీమియం కావడం గమనార్హం. ఇక ఎన్ఎస్ఈలో 1.81 శాతం ప్రీమియంతో రూ. 338 వద్ద షేర్లు లిస్టయ్యాయి. అయితే లిస్టింగ్ తర్వాత ఈ స్టాక్ కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరిచారు. భారీ కొనుగోళ్లు చేపట్టడంతో షేరు ఏకంగా 14 శాతం పెరిగింది. మార్కెట్లు ముగిసే నాటికి రూ. 391 స్థాయిని తాకింది. తొలి రోజే 16 శాతం మేర లాభాలు వచ్చినట్లయింది.


మరోవైపు.. జెమ్ ఏరోమాటిక్స్ షేర్లు సైతం ఈ రోజే మార్కెట్లలోకి ఎంట్రీ ఇచ్చాయి. ఐపీఓ ఇష్యూ ధర రూ. 325 వద్ద ఉండగా బీఎస్ఈలో రూ. 325 వద్ద ట్రేడింగ్ మొదలు పెట్టాయి. ఎలాంటి లిస్టింగ్ గెయిన్స్ ఇవ్వలేదు. ఎన్ఎస్ఈలో 2.5 శాతం ప్రీమియంతో రూ. 333 వద్ద లిస్టింగ్ అయ్యాయి. స్వల్ప లాభాలు ఇచ్చాయి. అలాగే శ్రీజి షిప్పింగ్ కూడా అరంగేట్రం చేసింది. పబ్లిక్ ఇష్యూ ధర రూ. 252 కాగా బీఎస్ఈలో 7 శాతం ప్రీమియంతో రూ. 271.85 వద్ద లిస్ట్ అయ్యాయి. ఇన్వెస్టర్లకు స్వల్ప లాభాలు అందించాయి.


ఈ ఐపీఓలు గతవారమే సబ్‌స్క్రిప్షన్ కోసం వచ్చాయి. ఇన్వెస్టర్ల నుంచి మంచి ఆదరణ పొందాయి. దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. అయినప్పటికీ ఐపీఓలు ఇన్వెస్టర్లకు మంచి లాభాలనే అందించాయని చెప్పవచ్చు. పటేల్ రిటైల్, విక్రమ్ సోలార్ షేర్లు లిస్టింగ్‌తోనే 20 శాతం వరకు లాభాలు అందించాయి. మరోవైపు.. ఈ రోజు రెండు కంపెనీల ఐపీఓలు సబ్‌స్క్రిప్షన్ కోసం వచ్చాయి. విక్రన్ ఇంజినీరింగ్, ఆ్లన్లాన్ హెల్త్ కేర్ పబ్లిక్ ఇష్యూ సబ్‌స్క్రిప్షన్ ఆగస్టు 29వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa