ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్టీ జెండాలతో కొట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు

national |  Suryaa Desk  | Published : Fri, Aug 29, 2025, 08:53 PM

ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు.. పార్టీ జెండాలతోనే ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. గుంపులు గుంపులుగా ఒకరినొకరు కొట్టుకోవడంతో.. చాలా మందికి గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు వీరిలా ఎందుకు కొట్టుకున్నారు, కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.


కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ ఇద్దరూ కలిసి నిర్వహించిన 'ఓటర్ అధికార యాత్ర' కార్యక్రమంలో కొందరు వ్యక్తులు.. ప్రధాని మోదీ సహా ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. బీజేపీ అగ్ర నాయకులంతా భగ్గుమన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ కావాలనే ఇలాంటి చర్యలు చేపడుతోందని ఆరోపించారు. ఇప్పటికే ఈ వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సైతం.. మోఈ ఘటనపై స్పందించారు. ప్రధాని మోదీని క్షమించమని అడిగారు. తప్పుడు వ్యాఖ్యలను తాము కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు.


అయినప్పటికీ బీజేపీ ఈ విషయాన్ని మర్చిపోవడం లేదు. చాలా సీరియస్‌గా తీసుకుని.. మోదీపై, ఆయన తల్లిపై వ్యాఖ్యలకు నిరసనగా బీహార్ రాజధాని పాట్నాలో ర్యాలీ నిర్వహించారు. అయితే దీనికి ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మరొక ర్యాలీని నిర్వహించారు. ఈ రెండు ర్యాలీలు ఒకదానికొకటి ఎదురు పడటంతో పరిస్థితి అదుపు తప్పింది. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు మొదట మాటల యుద్ధానికి దిగారు. ఆ తర్వాత అది శారీరక దాడులకు దారితీసింది.


ముఖ్యంగా చేతిలో ఉన్న పార్టీ జెండాలతోనే ఇరువైపులా కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో చూస్తుంటే.. కార్యకర్తలు తమ చేతుల్లో ఉన్న పార్టీ జెండాల కర్రలను ఆయుధాలుగా ఉపయోగించి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈక్రమంలోనే అనేక మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో పాట్నాలోని ప్రధాన రహదారులు యుద్ధ వారాణాన్ని తలపించాయి. ఈ హింసాత్మక ఘటనతో పాట్నాలో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది.


ఈ ఘటనపై రాజకీయ నాయకుల స్పందనలు కూడా అంతే ఘాటుగా ఉన్నాయి. బీజేపీ నాయకులు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నాయకులు తమను అన్యాయంగా రెచ్చగొట్టారని.. ఈ దాడి వెనుక బీజేపీ ప్రణాళిక ఉందని ఆరోపించారు. బీజేపీ నేతలు మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ గుణపాఠం నేర్చుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు నితీశ్ కుమార్ ప్రభుత్వం కావాలనే తమ ర్యాలీని అడ్డుకోవడానికి బీజేపీకి సహకరించిందని ఆరోపించారు. తమపై జరిగిన దాడి వెనుక అధికార పార్టీల కుట్ర ఉందని కాంగ్రెస్ నేతలు వాదించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa