ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి శుభవార్త.. ఇకపై చాలా ఈజీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 02, 2025, 05:10 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా రేషన్‌ కార్డులు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. అయితే రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ పంపిణీకి సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్లకు కొత్త స్మార్ట్ ఈ-పోస్ యంత్రాలను పంపిణీ చేస్తున్నారు. పాత కీప్యాడ్ ఈ-పోస్ యంత్రాల స్థానంలో ఈ కొత్త టచ్‌స్క్రీన్ యంత్రాలు వచ్చాయి. ప్రభుత్వం త్వరలో స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేయనుంది. ఈ కార్డులను ఈ యంత్రాల్లో స్వైప్ చేయవచ్చు.. పాత యంత్రాల వల్ల ఎదురైన సమస్యలను అధిగమించడానికి ఈ కొత్త యంత్రాలను తీసుకొచ్చారు.


కొత్త ఈ-పోస్ యంత్రాలు పాత వాటితో పోలిస్తే సరికొత్త టెక్నాలజీ, ఫీచర్లతో వచ్చాయి. ఈ మెషిన్లు చాలా వేగంగా పనిచేస్తాయి.. పాత యంత్రాల్లో నెట్‌వర్క్ సమస్యలు ఉండేవి.. ఈ కారణంగా రేషన్ డీలర్లు పంపిణీ విషయంలో ఇబ్బంది పడేవారు. ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త ఈపోస్ మెషిన్లకు ఆ సమస్య ఉండదు. ఈ మెషిన్‌లో సిమ్ ఉంటుంది. నెట్ లేకపోతే, వైఫైకి కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు.. డీలర్ తన మొబైల్ హాట్‌స్పాట్‌ను ఉపయోగించి కూడా ఈ మెషిన్ ఉపయోగించొచ్చు. ఈ ఈపోస్ స్మార్ట్ టచ్ స్క్రీన్ ఉంది. ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.


టచ్ చేస్తే వెంటనే లావాదేవీలు పూర్తవుతాయి.. స్మార్ట్ రేషన్ కార్డులను స్వైప్ చేయడానికి వీలుగా ఉంటుంది. స్మార్ట్ రేషన్ కార్డును ఈ మిషన్ పై పెట్టినా వైఫై ద్వారా ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవుతుంది. ఈ పోస్ మెషిన్‌లో బయోమెట్రిక్ కోసం కూడా ఆప్షన్ ఉంది. వేలిముద్ర పడకపోతే, కెమెరా ద్వారా ఐరిస్ తీసుకుంటారు.. ఈ యంత్రంలో జీపీఆర్‌ఎస్ వ్యవస్థ ఉంది. ఇది డేటాను రికార్డ్ చేస్తుంది.. ఈ స్మార్ట్ మెషీన్లను ఉపయోగించడం ద్వారా డిపోల వద్ద రద్దీ ఉండదు.. క్యూ లైన్లు ఉండవంటున్నారు.. రేషన్ పంపిణీ వేగంగా పూర్తి చేయొచ్చు అంటున్నారు. అలాగే రేషన్ అక్రమాలకు అవకాశం ఉండదంటున్నారు. ఈ నెలలోకిన కొన్ని రేషన్ షాపుల్లో కొత్త మెషిన్లతో పంపిణీ ప్రారంభమైంది.. కొన్నిచోట్ల ఈ నెల 15 తర్వాత అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు.


ఈ మెషిన్లు స్మార్ట్ రేషన్ కార్డులోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తాయి. స్మార్ట్ రేషన్ కార్డుల్లోని క్యూఆర్ కోడ్‌ను ఈ మిషన్లు స్కాన్ చేస్తాయి. దీని ద్వారా కార్డుదారుల వివరాలు ఈ-పోస్‌లో నమోదవుతాయి. ఏ సరుకులు, ఎన్ని కిలోలు ఇవ్వాలనే వివరాలు కూడా నమోదవుతాయి. ఈ మిషన్లలో సిమ్, వైఫై, హాట్‌స్పాట్, బ్లూటూత్, టచ్ స్క్రీన్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇవి ఆండ్రాయిడ్ టెక్నాలజీతో పనిచేస్తాయి. దీని ద్వారా వ్యవస్థలో పర్యవేక్షణ కట్టుదిట్టంగా ఉంటుందంటున్నారు. అంతేకాదు వినియోగదారులు తీసుకునే సరుకుల బిల్లును కూడా ఈ మిషన్ ద్వారా పొందవచ్చు అంటున్నారు. మొత్తం మీద రేషన్‌ తీసుకునేవారు ఇబ్బంది పడకుండా కొత్త మెషిన్లు అందిజేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa