ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొగాకు రైతుల కోసం ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2024-25 రబీ సీజన్లో మార్క్ఫెడ్ కొనుగోలు చేసిన బర్లీ పొగాకుకు సంబంధించిన నిధులను విడుదల చేసింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల రైతులకు ఈ డబ్బులు జమ చేశారు. మొత్తం 4,040 మంది రైతుల ఖాతాల్లో రూ.54.88 కోట్లను ప్రభుత్వం జమ చేశారు. బర్లీ పొగాకుకు సరైన ధర లేక రైతులు ఇబ్బంది పడ్డారు. దీంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయ మంత్రి అచ్చన్నాయుడు చొరవ తీసుకున్నారు. కొంతమంది వ్యాపారులు పొగాకు కొనుగోలు చేశారు. మిగిలిన 20.00 మిలియన్ కిలోల బర్లీ పొగాకును మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయించింది. మొత్తం రూ.54,88,92,060ను పొగాకు అమ్మిన 4,040 మంది రైతుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా బదిలీ చేసినట్లు మార్క్ఫెడ్ ఎండీ మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. డబ్బులు అకౌంట్లలో జమ చేశారని.. రైతులు చెక్ చేసుకోవాలని సూచించారు.
గతంలో మంచి ధరలు రావడంతో రైతులు ఈసారి బర్లీ పొగాకును ఎక్కువగా పండించారు. పంట చేతికి వచ్చాక కొనుగోలుదారులు మొఖం చాటేశారు. దీంతో రైతులు ఇబ్బందుల్లో పడ్డారు. వారిని ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలను వంద రోజుల క్రితం ప్రారంభించింది. ఉత్పత్తి నాణ్యతను బట్టి ధర చెల్లించి కొనుగోలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. దీనికోసం బడ్జెట్లో నిధులు కూడా కేటాయించింది.
గత సీజన్లలో పొగాకుకు మంచి ధర పలికింది. దీంతో చాలా మంది రైతులు ఈసారి బర్లీ పొగాకు సాగు చేశారు. తీరా పంట చేతికి వచ్చేసరికి కొనేవాళ్లు కరువయ్యారు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండగా.. రైతుల కష్టాలను చూసి కూటమి ప్రభుత్వం సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. మార్క్ఫెడ్ ద్వారా కేంద్రాలను ప్రారంభించి.. ఉత్పత్తి నాణ్యతను బట్టి ధర ఇచ్చి కొనుగోలు చేసేంది. ఈ మేరకు ప్రత్యేకంగా బడ్జెట్ కూడా కేటాయించారు.
ఏపీ ప్రభుత్వం మొత్తం 2,800 టన్నులు కొనుగోలు చేసేందుకు అనుమతించగా.. అయితే ఇప్పటి వరకు 2,300 టన్నుల వరకు సేకరించారు. ఇంకా నిల్వలు ఉండటంతో రైతులు పొగాకు కొనుగోలుదారులతో సమావేశమై దీనిపై చర్చించారు. మరో 500 టన్నులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మార్క్ఫెడ్ అధికారులు తెలిపారు. ప్రభుత్వం డబ్బులు చెల్లించడంపై పొగాకు రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం తోతాపురి మాామిడి రైతులకు కూడా తీపికబురు చెప్పింది.. త్వరలోనే వారి బ్యాంక్ అకౌంట్లలో కూడా పెండింగ్ డబ్బులు జమ చేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa