ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌తో రష్యా సంబంధాలను గౌరవిస్తాం.. కానీ.. : పుతిన్‌తో పాక్ ప్రధాని షరీఫ్

international |  Suryaa Desk  | Published : Wed, Sep 03, 2025, 10:15 PM

షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సుకు హాజరైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌కు అన్ని విధాలుగా మద్దతు ఇచ్చి, దక్షిణాసియా ప్రాంతంలో సమతౌల్యతను పాటించినందుకు రష్యాకు షెహబాజ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ క్రమంలో భారత్‌-రష్యా సంబంధాల గురించి కూడా పాక్ ప్రధాని ప్రస్తావించడం గమనార్హం. భారత్‌తో రష్యా సంబంధాలను గౌరవిస్తామని, అదే సమయంలో మాస్కోతో తాము కూడా చాలా బలమైన సంబంధాలను కోరుకుంటున్నామని షరీఫ్ వ్యాఖ్యానించారు. ఇవి అనుబంధం, పరిపూర్ణమైనవిగా ఉండాలని పాక్ ప్రధాని అన్న మాటలకు రష్యా అధినేత పుతిన్ చిన్నగా తలాడించడం గమనార్మం. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోలో.. పుతిన్‌ను డైనమిక్ లీడర్ అంటూ షెహబాజ్ పొగడ్తల్తో ముంచెత్తారు.


బహుళ ధ్రువాలుగా మారుతున్న ఈ ప్రపంచంలో రష్యాతో స్నేహం కోసం పాకిస్థాన్ ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా భారత్‌‌పై ట్రంప్ అదనపు సుంకాలు నేపథ్యంలో చైనా, న్యూఢిల్లీ సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైన వేళ మాస్కోతో చెలిమికి పాక్ తహతహలాడటం చెప్పుకోదగ్గ విశేషం. ఇక, తియాంజిన్‌ వేదికగా జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశం భారత్, చైనాలను మరింత దగ్గర చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇది గొప్ప దౌత్య విజయాన్ని అందించింది. పహల్గామ్ ఉగ్రదాడిని ఎస్‌సీఓని 10 సభ్యదేశాలు ఖండిస్తూ ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.


ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానంలో పాక్ ప్రస్తావన లేకపోయినా.. దానిపై సంతకం చేసిన వారిలో షెహబాజ్ షరీఫ్ ఉన్నారు. అయితే, చైనాతో పాకిస్థాన్‌కు బలమైన సంబంధాలే ఉన్నాయి. సెప్టెంబర్ 3న బీజింగ్‌లో జరిగే ప్రధాన సైనిక కవాతులో పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో సహా కనీసం 26 మంది ప్రపంచ నాయకులు హాజరకానున్నారు. వీరిలో పాకిస్థాన్ ప్రధాని కూడా ఒకరు. ఇదిలా ఉండగా, పాకిస్థాన్ ప్రధాని Xసెహబాజ్ షరీఫ్‌, ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్లు.. చైనా అదినేత షీ జిన్‌‌పింగ్‌తో గత నెలలో భేటీ అయ్యారు.


వాస్తవానికి ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు చైనా మద్దతు ఇచ్చింది. భారత్‌పై దాడులకు చైనా ఆయుధాాలను దాయాది వాడిన విషయం తెలిసిందే. అలాగే, గగనతల రక్షణ కోసం చైనా వ్యవస్థను పాక్ వినియోగించగా.. భారత్ దెబ్బకు అది ధ్వంసమైంది. మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టిన ఇండియన్ ఆర్మీ.. పాక్‌కు రక్షణగా ఉన్న చైనాా రాడార్లు ఏమార్చి.. దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa