ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రష్యా నుంచి చమురు కొనడం ఆపకపోతే 50 శాతం టారిఫ్‌లు తప్పవని వార్నింగ్

international |  Suryaa Desk  | Published : Sat, Sep 06, 2025, 09:27 AM

భారత్, అమెరికాల మధ్య వాణిజ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో భారత్ వైఖరిపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గకుండా తన జాతీయ ప్రయోజనాలకే కట్టుబడిన భారత్, రానున్న ఒకట్రెండు నెలల్లో దిగివచ్చి తమతో వాణిజ్య ఒప్పందం కోసం క్షమాపణ చెబుతుందని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లూట్నిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో లూట్నిక్ మాట్లాడుతూ ఇంకో నెల, రెండు నెలల్లో భారత్ చర్చల కోసం మా వద్దకు వస్తుంది. అప్పుడు వారు క్షమాపణ చెప్పి డొనాల్డ్ ట్రంప్‌తో ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు" అని జోస్యం చెప్పారు. అమెరికాకు మద్దతు ఇవ్వని పక్షంలో, భారత్ నుంచి వచ్చే ఎగుమతులపై 50 శాతం టారిఫ్‌లు చెల్లించాల్సి వస్తుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. "ఇదంతా కేవలం ధైర్యం ప్రదర్శించడమే. అతిపెద్ద క్లయింట్‌తో గొడవపడటం బాగుంటుంది. కానీ చివరికి వ్యాపార వర్గాలు అమెరికాతో ఒప్పందం కోరుకుంటాయి" అని ఆయన వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa