ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రొఫెసర్పై దాడి ఘటన కలకలం రేపింది. ఓ విద్యార్థి ప్రొఫెసర్పై కత్తితో దాడి చేశాడు.
ఎంటెక్ చదువుతున్న విద్యార్థి వినయ్ ఇవాళ పరీక్షకు హాజరయ్యారు. అయితే సదరు విద్యార్థి ల్యాబ్కు సరిగా రావడం లేదని ప్రొఫెసర్ గోపాలరాజు ప్రశ్నించారు.. ఆ విద్యార్థిని పరీక్షకు అనుమతించకపోవడంతో.. ఆ కోపంలో విద్యార్థి ప్రొఫెసర్పై కత్తితో దాడి చేశాడు..
అనంతరం హాస్టల్లోకి పారిపోయాడు.
వెంటనే సిబ్బంది, విద్యార్థులు ప్రొఫెసర్ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. ప్రొఫెసర్ గోపాలరాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. ప్రొఫెసర్ గోపాలరాజు ఎంటెక్ డిపార్ట్మెంట్ ఇంఛార్జ్గా ఉన్నారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. ప్రొఫెసర్పై దాడి చేసిన విద్యార్థిని వెంటనే పట్టుకున్నారు.. అతడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రొఫెసర్ గోపాలరాజుపై విద్యార్థి కత్తితో దాడి ఘటనతో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఉద్రిక్తంగా మారింది.
నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు గేట్-2026 పరీక్ష గురించి అవగాహన కల్పించారు. స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్లో ఒక సెమినార్ నిర్వహించారు. హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సెల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఏస్ ఇంజనీరింగ్ అకాడమీకి చెందిన మణిమోహన్ త్రినాథ్ ముఖ్య వక్తగా హాజరయ్యారు. గేట్ పరీక్ష యొక్క ప్రాముఖ్యతను, దాని ద్వారా కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు.
గేట్ పరీక్ష నిర్మాణం, సిలబస్ గురించి మణిమోహన్ త్రినాథ్ విద్యార్థులకు తెలిపారు. ఐఐటీ, ఎన్ఐటీ వంటి గొప్ప సంస్థల్లో చదవడానికి, ప్రభుత్వ ఉద్యోగాలకు గేట్ స్కోర్ చాలా ముఖ్యమని ఆయన అన్నారు. గేట్ పరీక్షకు ఎలా సిద్ధం కావాలో కూడా ఆయన వివరించారు.
గేట్ పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ఒక మాక్ పరీక్షను నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ పరీక్ష ద్వారా విద్యార్థులు తమ సన్నద్ధత స్థాయిని తెలుసుకోవచ్చు. అంటే, తాము ఎంతవరకు సిద్ధంగా ఉన్నామో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa