అనంతపురం నగరంలో సూపర్ సిక్స్-సూపర్హిట్ బహిరంగ సభ నేపథ్యంలో బుధవారం ట్రాఫిక్ మళ్లించినట్లు ఎస్పీ జగదీష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంక్షలను వాహనదారులు తప్పనిసరిగా పాటించాలన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే వాహనదారులు అనంతపురం నగరం నుంచి కాకుండా వడియంపేట, బుక్కరాయసముద్రం, నాయనపల్లి క్రాస్, నార్పల క్రాస్, బత్తలపల్లి, ధర్మవరం, ఎన్ఎస్ గేట్ మీదుగా నేషనల్ హైవే 44 మార్గంలో వెళ్లాలన్నారు. కర్నూలు నుంచి తిరుపతి, చైన్నై వెళ్లే వాహనదారులు వడియంపేట, బుక్కరాయసముద్రం, నాయనపల్లి క్రాస్, బత్తలపల్లి, కదిరి, మదనపల్లె మార్గంలో వెళ్లాలని సూచించారు. బళ్లారి నుంచీ బెంగళూరు వెళ్లే వాహనదారులు చెళ్లికెర, తుంకూరు, నెలమంగళ, బెంగళూరు మార్గంలో ప్రయాణించాలని సూచించారు. బెంగళూరు నుంచీ హైదరాబాద్ వెళ్లే వాహనదారులు బత్తలపల్లి, నార్పల క్రాస్, నాయనపల్లి క్రాస్, బుక్కరాయసముద్రం, వడియంపేట, నేషనల్ హైవే 44 రహదారిలోకి చేరి ప్రయాణించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa