ఆసియా కప్ 2025 టోర్నమెంట్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆసియా ఖండంలోని శ్రేష్ఠ జట్లు తలపడనున్న ఈ టోర్నీపై క్రికెట్ అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. తొలి మ్యాచ్లో అఫ్గానిస్థాన్, హాంగ్కాంగ్ జట్లు ఈ రోజు (సెప్టెంబర్ 9) మైదానంలో దిగనున్నాయి. ప్రారంభ పోరుతోనే టోర్నీకి మంచి ఊపొస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు.
భారత జట్టు తన తొలి మ్యాచ్ను సెప్టెంబర్ 10న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో ఆడనుంది. ఈ మ్యాచ్తో టీమిండియా తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. గత కొన్ని టోర్నీల్లో శక్తివంతంగా కనిపించిన భారత్ ఈ సారి టైటిల్ను అందుకోవాలని ఉత్సాహంగా ఉంది. మ్యాచ్ షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా జరగనుంది.
ఈ టోర్నీ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టగా, శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, శివమ్ దూబే వంటి ఆటగాళ్లు రీఎంట్రీ ఇచ్చారు. ఇది జట్టుకు మరింత బలాన్నిస్తుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈసారి ఆసియా కప్ టోర్నీలో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చూపించాలనే ఉద్దేశంతో భారత జట్టు సిద్ధమవుతోంది. అయితే, గత టోర్నీల్లో చక్కటి ప్రదర్శన చేసిన శ్రేయస్ అయ్యర్కు ఈసారి జట్టులో చోటు లభించకపోవడం అభిమానులను కొంత నిరాశపర్చింది. అయినా, యువ ఆటగాళ్లకు అవకాశం దక్కడం ద్వారా జట్టులో నూతన శక్తిని చూడొచ్చని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa