ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీటీడీకి కూరగాయాలు దానం చేస్తున్న దాతలకు ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 10, 2025, 03:00 PM

అన్నప్రసాదాలకు కూరగాయలు విరాళంగా టీటీడీకి అందజేస్తున్న దాతలతో ఒక వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సూచించారు. కూరగాలయ దాతలతో బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటీవల అన్నప్రసాద విస్తరణ చేసిన నేపథ్యంలో దాతలు మరింత ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. ప్రస్తుతం దాతలు రోజుకు 25 రకాల కూరగాయలు, 6 నుంచి 7 టన్నులు అందజేస్తున్నారని, బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకు 10 టన్నులు అవసరముంటుందని అన్నప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్రకుమార్‌, క్యాటరింగ్‌ ఆఫీసర్‌ శాస్ర్తి వివరించారు. కూరగాయల విరాళాలు 2022లో 5.79 శాతం నుంచి 2025లో దాదాపు 7 శాతానికి పెరిగాయని తెలిపారు. తమిళనాడు, కర్ణాటక, ఏపీకి చెందిన కూరగాలయ దాతలను వెంకయ్య చౌదరి శ్రీవారిప్రసాదాలతో సత్కరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa