ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉప్పుటేరు అభివృద్ధిపై ప్రభుత్వం కసరత్తు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 10, 2025, 03:11 PM

ఉప్పుటేరుకు ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొల్లేరు నుంచి వరద నీరు సక్రమంగా సముద్రంలోకి వెళ్లాలంటే డ్రెడ్జింగ్‌ చేయాల్సిందేనంటూ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. గతంలో రూ. 500 కోట్లతో డీపీఆర్‌ సిద్ధం చేశారు. బడమేరుతో సహా డీపీఆర్‌ను ప్రభుత్వానికి పంపారు. దీనివల్ల కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం లేదని భావించిన ప్రభుత్వం ఉప్పుటేరు డ్రెడ్జింగ్‌కు ప్రత్యేకంగా సర్వే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. జలవనరుల శాఖ అధికారులు ఉప్పుటేరులో సర్వే చేస్తున్నారు. డ్రెడ్జింగ్‌కు అవసరమైన నిధులతో ప్రత్యేకంగా ప్యాకేజీ ప్రతిపాదనలు చేయనున్నారు. దానిని కేంద్రానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa