పాతపట్నం మండలంలోని కొండ ప్రాంతాల్లో గురువారం ఉదయం దట్టంగా మంచు కురిసింది. గత నాలుగు రోజులుగా పగటిపూట ఎండలు, సాయంత్రం వర్షాలు, ఉదయాన్నే మంచు కురుస్తుండటంతో వాతావరణంలో విభిన్న మార్పులు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ వాతావరణం వల్ల పనుల నిమిత్తం బయటకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రైతుల అభిప్రాయం ప్రకారం, ఈ వాతావరణం కూరగాయల పంటలకు నష్టం కలిగించే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa